BRS Party : జాతీయ పార్టీ హోదా `బీఆర్ఎస్`కు ఎండమావే!
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం తరువాత బుధవారం టీఆర్ఎస్ ను క్లోజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే
- By CS Rao Published Date - 12:08 PM, Thu - 6 October 22
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం తరువాత బుధవారం టీఆర్ఎస్ ను క్లోజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. జెండా, చిహ్నం, రంగును యథాతదంగా ఉంచుతూ ఎజెండాను మార్చేయబోతున్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలతో ఎన్నికల కమిషన్ వద్ద ఢిల్లీ కేంద్రంగా రిజిస్త్రేషన్ ప్రక్రియ జరుగుతోంది.
ఇలాంటి సందర్భంంలో జాతీయ పార్టీ స్థాపించడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు అనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండేలా రూపొందించిన రాజ్యాంగం మనది. ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా చెప్పుకొవచ్చు. ఇవే కాకుండా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ పార్టీలు అనేకం ఉన్నాయి.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..?
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు)సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా గెలవాలి.
(లేదా)
కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
(లేదా)
గత సాధారణ ఎన్నికల్లో లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి.
ప్రాంతీయ పార్టీ గుర్తింపు
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్రంలో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్సభ స్థానాన్ని గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
(లేదా)
లోక్సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
అయితే, ఒక పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు.అంటే, ఎన్నికల తరవాత పార్టీలు తమ గత హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది.దీనివల్లే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.
దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు
2021 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి.
1.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)
2.భారతీయ జనతా పార్టీ (BJP)
3.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – (CPI)
4.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – (CPI(M))
5.ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC)
6.బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
7.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)
8.నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)
రిజిస్టర్డ్ పార్టీలు
జాతీయ, ప్రాంతీయ పార్టీ గుర్తింపు సాధించలేని పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా పరిగణిస్తారు.కొత్తగా స్థాపించిన పార్టీ ఒక రాష్ట్ర శాసన ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలి. 50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు అయితే కనీసం 5 స్థానాల్లో పోటీ చేయాలి. 20 కంటే తక్కువ లోక్సభ స్థానాలు ఉంటే కనీసం 2 స్థానాల్లో పోటీ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం భారత్ రాష్ట్ర సమితి (BRS) ని ఎన్నికల సంఘం గుర్తిస్తే వచ్చేది రిజిస్టర్డ్ పార్టీ హోదా మాత్రమే. జాతీయ పార్టీ కాదని గుర్తుంచుకోవాలి.
Related News
Vaddiraju: కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద�