Telangana High Court: కేసీఆర్ కు షాక్.. బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు
పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
- By Balu J Published Date - 03:01 PM, Tue - 18 July 23
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం కొన్ని చోట్లా స్థలాలు కేటాయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్ఎస్కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఎకరం రూ.50 కోట్లు పలుకుతున్న భూమిని కేవలం రూ.3.41 కోట్లకే బీఆర్ఎస్ కు కేటాయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా భూకేటాయింపుకు సంబంధించిన పత్రాలన్నింటినీ రహస్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఆగస్ట్ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టయింది.
Also Read: Food Poisoning: ఎగ్ బిర్యానీ తిని 32 మంది విద్యార్థినులకు అస్వస్థత
Related News
Osmania University: ఓయూలో నీటికి కటకట.. కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ నేత ఫైర్
Osmania University: కరెంటు, తాగు నీటి కొరత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత ఉందని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వందేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చీకటి రోజు వచ్చాయని, కరెంటు కొరత న