CM Revanth: రాయదుర్గం-శంషాబాద్ మెట్రో విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం
ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ మెట్రో రైలు మార్గంపై సీఎం రేవంత్ కు పలు సందేహాలున్నాయి.
- By Balu J Published Date - 11:22 AM, Wed - 13 December 23
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం మార్గం లో మెట్రో రైల్ అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గ్-విమానాశ్రయ మార్గాన్ని రద్దు చేస్తుంది. వాయిదా వేసే అవకాశం ఉంది. JBS-ఫలక్నుమా కారిడార్ను పూర్తి చేసి, పహాడీ షరీఫ్ మీదుగా విమానాశ్రయం వరకు విస్తరించడంతోపాటు లక్డికాపూల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య లైన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఓల్డ్ సిటీ డెవలప్మెంట్పై ఏఐఎంఐఎంకి చెందిన ఏడుగురు శాసనసభ్యులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మంగళవారం విప్లవాత్మక మార్పుకు సంబంధించిన సూచనలను, పట్టణ అభివృద్ధికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.
ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ మెట్రో రైలు మార్గంపై ముఖ్యమంత్రికి సందేహాలు ఉన్నాయని, కేవలం రియల్టర్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పినట్టు సమాచారం. BRS ప్రభుత్వం ప్రాజెక్ట్పై చాలా ఆసక్తిని కనబరిచింది. ప్రయాణికులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్కు వెళ్లే వారికి ఏ మార్గం మరింత ఉపయోగకరంగా ఉంటుందో చూడాలి.
Also Read: WhatsApp Pin Chat : వాట్సాప్ ఛాట్లను ఇలా ‘పిన్’ చేసేయండి
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.