Revanth Reddy: కేటీఆర్ టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా.. దాన్ని సృష్టించిందీ కాంగ్రెస్సే-రేవంత్ రెడ్డి!
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి.
- By Hashtag U Published Date - 10:21 PM, Fri - 6 May 22
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్..కేటీఆర్ సంధించిన ట్వీట్ కు టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఘాటుగా జవాబు చెప్పారు. ఈ మేరకు ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడించింది. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ రీ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు టూరిస్టులు వస్తుంటారు..వెళ్తుంటారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ట్వీట్ పై వెంటనే స్పందించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్టు ప్రాంతం కావచ్చంటూ కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణను కేటీఆర్ పర్యాటక ప్రాంతంగా పరిగణిస్తుంటే…తాము మాత్రం ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలంగానే భావిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం తెలంగాణ అని అన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ వక్రమాటల ప్రకారం ఇది టూరిస్టు ప్లేస్ అనుకున్నా…దానినిసృష్టించింది కాంగ్రెస్సే అంటూ ఘాటు రిప్లే ఇచ్చారు.
కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు!
కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా…
దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే. https://t.co/d3Iv53SYnl— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022
Related News
KTR Tweet Viral: కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్!
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్లో కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.