Revanth Reddy: రేవంత్ అనే నేను.. తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్!
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది.
- By Balu J Published Date - 01:36 PM, Thu - 7 December 23
Revanth Reddy: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరిగ్గా 1:20 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. రేవంత్ అనే నేను అని కొత్త ముఖ్యమంత్రి అనగానే ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది.
‘‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్త శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అంటూ రేవంత్ ప్రమాణం చేశారు.
ఇదే వేదికపై రేవంత్ తో పాటుగా 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, హిమాచల్ సీఎం, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్ కు రావడంతో ఎల్బీ స్టేడియమంతా సందడి నెలకొంది.
Also Read: Seethakka: మావోయిస్టు నుంచి మంత్రిదాకా, సీతక్క పొలిటికల్ జర్నీ విశేషాలు
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.