TG Assembly Session : కల్వకుంట్ల కుటుంబం అంటే కలవకుండా చూసే కుటుంబం- CM రేవంత్
TG Assembly Session : 'వారిది కల్వకుంట్ల కుటుంబం కాదు, బీసీలు, ఓసీలు కలవకుండా చూసే కుటుంబం' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్న ఉద్దేశం BRSకు లేదని, దీనికి గంగుల కమలాకర్ వంటి నాయకులు వారి మాయలో పడకూడదని సూచించారు
- Author : Sudheer
Date : 31-08-2025 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
CM రేవంత్ రెడ్డి, తెలంగాణలో బలహీన వర్గాల అభివృద్ధి విషయంలో BRS పార్టీకి చిత్తశుద్ధి లేదని తీవ్రంగా ఆరోపించారు. ‘వారిది కల్వకుంట్ల కుటుంబం కాదు, బీసీలు, ఓసీలు కలవకుండా చూసే కుటుంబం’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్న ఉద్దేశం BRSకు లేదని, దీనికి గంగుల కమలాకర్ వంటి నాయకులు వారి మాయలో పడకూడదని సూచించారు. BRS తీసుకొచ్చిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలు బలహీన వర్గాలకు అన్యాయం చేసేవిగా ఉన్నాయని, అవి ఇప్పుడు గుదిబండగా మారాయని పేర్కొన్నారు.
CM Revanth Reddy : ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం
అందుకే రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల నాయకులు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తద్వారా బీసీలకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడానికి, వారి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. గత ప్రభుత్వాల విధానాలు బీసీలకు ఎలా అన్యాయం చేశాయో కూడా వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటున్నామని, ఈ రిజర్వేషన్లు అందులో ఒక భాగమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ చట్టాల ద్వారా బీసీలు, ఇతర బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ చర్యలు బీసీల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తాయని ఆయన నమ్మకంగా చెప్పారు.