HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Promises Made To Asha Workers Should Be Fulfilled Harish Rao

Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు

ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.

  • By Gopichand Published Date - 02:43 PM, Mon - 25 August 25
  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: ఆశా కార్యకర్తలకు స్థిర వేతనం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తలు నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. “ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఫిక్స్‌డ్ వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఇప్పుడు మాత్రం మాట తప్పి, వారిని రోడ్డు మీదకు రప్పించారు. ఇది దుర్మార్గం” అని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు. “హైదరాబాద్ వాటర్ బోర్డ్‌లో రూ. 4000 కోట్లు, హెచ్‌ఎండీఏలో రూ. 10,000 కోట్లు, జీహెచ్‌ఎంసీలో రూ. 6000 కోట్లు, ఇరిగేషన్ శాఖలో రూ. 10,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఈ కాంట్రాక్టుల కోసం డబ్బులు ఉన్నాయి కానీ, పేద ప్రజలకు సేవ చేసే ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి మాత్రం నిధులు లేవా? ఈ రూ. 50 వేల కోట్ల కాంట్రాక్టులు ఎక్కడి నుంచి వచ్చాయి రేవంత్ రెడ్డి?” అని ఆయన ప్రశ్నించారు.

Also Read: India-Pak : పాకిస్థాన్‌కు భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక

అసెంబ్లీని స్తంభింపజేసి అయినా పోరాడుతాం

ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. “మీ హక్కుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే మీ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం” అని హామీ ఇచ్చారు.

ఇతర ప్రధాన అంశాలు

కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన ఆశా వర్కర్ల సేవలను కేసీఆర్ ప్రభుత్వం గౌరవించిందని, ఆనాడు రూ. 2,200 ఉన్న జీతాన్ని రూ. 10,000కు పెంచామని హరీష్ రావు గుర్తు చేశారు. గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, గ్రామ పంచాయతీలకు శానిటేషన్ నిధులు, ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు సేవలు నిలిపివేసే పరిస్థితి వస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులకు రిబ్బన్లు కత్తిరించడానికి మాత్రమే తిరుగుతున్నారని, కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, గురుకులాల బిల్లులు, డీఏ, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వంటి అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని హరీష్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆశా కార్యకర్తలను పిలిపించి మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఆశా కార్యకర్తలు తమ సత్తా ఏమిటో చూపిస్తారని హెచ్చరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asha workers
  • brs
  • CM Revanth Reddy
  • congress
  • harish rao
  • telangana
  • telugu news

Related News

Bihar Election Congress

Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

Bihar Election Results Effect : బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, దీనికి గల కారణాలపై పార్టీలో అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి

  • Brs

    BRS : బిఆర్ఎస్ పార్టీకి భారీగా నిధుల కొరత

  • Sand Supply

    Sand Supply : ఆంధ్ర నుంచి తెలంగాణ కు యథేచ్ఛగా ఇసుక

  • Telangana Rising Global Sum

    Global Summit: దావోస్ సమ్మిట్ తరహాలో .. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

  • CM Revanth

    CM Revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏర్పాట్లను సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి!

Latest News

  • India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

  • Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

  • H5N5 Virus: కరోనా తర్వాత ప్రపంచంలోకి కొత్త వైరస్!

  • Tata Sierra: భార‌త మార్కెట్‌లోకి తిరిగి వ‌చ్చిన‌ టాటా సియెర్రా.. బుకింగ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Billionaire List: స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు!

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd