HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prjecthigh Level Probe Into Kaleswaram Project Demanded

Kaleshwaram: ‘‘కాళేశ్వరం’’ అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి!

  • Author : Hashtag U Date : 26-07-2022 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kaleshwaram
Kaleshwaram

“కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి భాద్యులైన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవితవ్యంపై ఇంజనీరింగ్ నిపుణులు, తెలంగాణ బుద్దిజీవులతో లోతైన సమీక్ష చేపట్టాలి.” అని తెలంగాణ అఖిల పక్షాలు, ఉద్యమ సంస్థలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(TJF) అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అధ్యక్షతన తెలంగాణ ఇంజనీర్స్ ఫోరమ్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్.. ప్రజోపయోగమా? రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగమా? వాస్తవాలు – వక్రీకరణలు’ అనే అంశంపై, సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిల పక్ష నేతలు, ఇంజనీర్లు, సీనియర్ జర్నలిస్ట్ లు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరమ్ అధ్యక్షుడు దొంతుల లక్ష్మినారాయణ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మాట్లాడుతూ.. “రూ. లక్ష 20 వేల కోట్ల ప్రజాధనంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నాసిరకం పనులు చేసిన కాంట్రక్టర్ కృష్ణారెడ్డి ని తక్షణమే అరెస్ట్ చేయాలి. తెలంగాణకు అన్యాయానికి గురవుతుందని ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకుంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారు. ఈ 8 ఏళ్లలో సాధించింది ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే. కేసీఆర్ తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు. ఇదే జరిగిన అభివృద్ధి. కేసీఆర్ పథకాలు అడుక్కు తినేలా ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం.”

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్ సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు. అధికారం ఆస్తులను పెంచుకుంటే కాళేశ్వరం అవుతుందని అన్నారు. ఈ సారి చాలా గ్రామాలు ముంపునకు గురవడం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్మాణమే కారణమని దుయ్యబట్టరు. తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఆస్తులు పెంచుకోవడం కోసమే పని చేస్తున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కేసీఆర్ సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు. అధికారం ఆస్తులను పెంచుకుంటే కాళేశ్వరం అవుతుందని అన్నారు. ఈ సారి చాలా గ్రామాలు ముంపునకు గురవడం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్మాణమే కారణమని దుయ్యబట్టరు. తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఆస్తులు పెంచుకోవడం కోసమే పని చేస్తున్నారని దుయ్యబట్టారు.

బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ.. “ఎవరు అవినీతి చేసిన బీజేపీ ప్రభుత్వం వదిలి పెట్టదు. కాళేశ్వరంలో అవినీతి అక్రమాలపై కేంద్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కాళేశ్వరం ముంపుపైన ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షించాలి”.

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు మాట్లాడుతూ… “కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నాణ్యత లేని నిర్మాణలు చేసిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి.” కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవినీతికి కారణమైన సీఎం కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సీబీఐ విచారణ జరిపించాలి.

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తో పాటు ఇంజనీర్స్, కాంట్రాక్టర్లు కూడా దోచుకుంటున్నారు. పార్టీలన్నీ మౌనం పాటిస్తున్నాయి. కేసీఆర్ ప్రాజెక్టులన్నీ ప్రజలను మోసం చేశావే.

పలు తీర్మానాలు

1. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో, రీ డిజైన్ లో జరిగిన తప్పిదాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు కూలటం, నీళ్లు పంపులను మొత్తం ముంచేశాయి.దీనికి తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత. నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో బాధ్యులైన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

2. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలపై, అవినీతిపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

3. గోదావరి, కృష్ణా నదులను వాటిపై నిర్మాణాలను తన చేతిలోకి తీసుకుంటూ చట్టవ్యతిరేకoగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను వెంటనే ఉపసంహరించాలి.

4. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంశించారు.మరోవైపు పార్లమెంటులో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమన్నారు.ఈ ద్వంద్వ వైఖరిని రౌండ్ టేబుల్ సమావేశం నిరసించింది. ఇది తెలంగాణకు అన్యాయం కాదా అని ప్రశ్నించారు.

5. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని, ఆదివాసీల ముంపు నివారించాలని, ఆంద్రప్రదేశ్ లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలోకి మార్చాలని సమావేశం డిమాండ్ చేసింది.

6. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిపుణులు, మొత్తంగా తెలంగాణ పౌర సమాజం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలను, అవినీతిని ప్రత్యేకంగా పరిశీలించాలని, నిజాలను సమాజానికి వివరించాలని సమావేశం డిమాండ్ చేసింది.

అ సందర్బంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవి కుమార్ మాట్లాడుతూ.. ఎవరు తెలంగాణ పట్ల ప్రేమతో ఉన్నారో అలాంటి వారు, నిపుణులైన ఇంజనీర్స్ తో ఒక నిజానిర్దారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంతటితో ఆపేస్తే ఇక్కడితో ఆగిపోదు, మళ్ళీ రికరింగ్ పేరుతో భారీగా డబ్బులు ఖర్చు చేస్తారని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద తప్పు జరిగిందని, ఆ తప్పును ఇప్పుడు ఎలా సరిదిద్దలో ఆలోచించాలన్నారు. ప్రభుత్వం బేషజాలకు వెళ్లకుండా అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అయిన తప్పును మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత మన పైన ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress leaders
  • Kaleshwaram Lift Irrigation Scheme
  • kaleshwaram project
  • probe demanded
  • TJF

Related News

Changes in Congress's action on National Employment Guarantee.

జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, గ్రామీణ కార్మికులకు సరైన పనిదినాలు కల్పించడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ నిరసనల ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

  • Vote Chori Rally

    Vote Chori : ‘ఓట్ చోరీ’పై ఈరోజు కాంగ్రెస్ మెగా ర్యాలీ

Latest News

  • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

  • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

  • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd