Telangana
-
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్స్టేషన్లు, 2 డిపోలు
'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరగడంతో, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 ఆధునిక బస్ స్టేషన్లు మరియు 2 కొత్త బస్ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
Date : 04-02-2026 - 11:15 IST -
తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 11న జరగనున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికల్లో భాగంగా.. జనసేన మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.
Date : 04-02-2026 - 10:11 IST -
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా భారీ షెడ్యూల్ను ఖరారు చేశారు. అధికార పక్షం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు.
Date : 04-02-2026 - 8:45 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుపై వేటు వేస్తూ, ఆయనను డీఎస్పీ స్థాయి నుంచి సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) స్థాయికి డిమోట్ (Demote) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 04-02-2026 - 8:26 IST -
మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !
హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎంఐఎం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (71) మరణం ఆ పార్టీకి తీరని లోటు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పాతబస్తీలోని ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Date : 03-02-2026 - 9:30 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నంది నగర్ ఉన్న కేసీఆర్ నివాసంలో మాదాపూర్ డీసీపీ రీతి రాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఐపీఎస్ అధికారుల బృందం సుమారు ఐదు గంటల పాటు ఆయనను విచారించింది
Date : 02-02-2026 - 10:55 IST -
Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్
కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్' నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి
Date : 01-02-2026 - 12:43 IST -
Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన
'వికసిత్ భారత్' లక్ష్యంగా సాగుతున్న ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా, అందులో ఏకంగా మూడు కారిడార్లు హైదరాబాద్ను
Date : 01-02-2026 - 11:46 IST -
ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి : విప్లవ గొంతుకకు ఘన నివాళి
చిన్నతనం నుంచే పల్లె ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన, వాటిని పాటలుగా మలిచి ప్రజలను చైతన్యవంతం చేశారు. సామాన్య ప్రజల భాషలో, వారి బాధలను ప్రతిబింబించేలా ఆయన పాడిన పాటలు తెలంగాణ గడ్డపై విప్లవ కాంక్షను రగిల్చాయి
Date : 31-01-2026 - 11:54 IST -
సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) జారీ చేసిన నోటీసుల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు
Date : 31-01-2026 - 8:11 IST -
తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల సందడి మున్సిపల్ కార్యాలయాల వద్ద పోటెత్తింది. గడువు ముగిసే సమయానికి కార్యాలయాల ఆవరణలో ఉన్న వారందరికీ నామినేషన్లు దాఖలు చేసేందుకు
Date : 30-01-2026 - 7:06 IST -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పా ?
వీణవంకలో జరుగుతున్న సమ్మక్క జాతరకు తన కుటుంబంతో కలిసి భారీ కాన్వాయ్తో బయలుదేరిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జాతర వద్ద రద్దీని తగ్గించేందుకు పరిమిత వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు
Date : 30-01-2026 - 11:18 IST -
ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!
ఈ ఆరోపణలపై గతంలోనే స్పందించిన మాజీ సీఎం కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. "ఫోన్ ట్యాపింగ్.. తోక ట్యాపింగ్" అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి చిన్న విషయాలతో సంబంధం ఉండదని
Date : 30-01-2026 - 9:44 IST -
నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!
విచారణా వ్యూహంలో భాగంగా ఇప్పటికే సిట్ అధికారులు కీలక నేతల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు
Date : 29-01-2026 - 7:20 IST -
మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు
Medaram Jatara మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి Huge Demand for Goats and Chickens at Medaram. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసు
Date : 29-01-2026 - 4:30 IST -
తెలంగాణ రైతులకు శుభవార్త..
Telangana Farmers తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ […]
Date : 29-01-2026 - 3:28 IST -
రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం
గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Date : 29-01-2026 - 2:26 IST -
మేడారం భక్తులకు శుభవార్త..మగవారికి ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 'మహాలక్ష్మి' పథకం ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండగా, ఇప్పుడు మేడారం వెళ్లే పురుష భక్తులకు కూడా ఒక ప్రత్యేక ప్రాంతం నుండి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.
Date : 29-01-2026 - 12:50 IST -
Big Breaking News..కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు
KCR తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమయింది. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు. కాసేపటి క్రితం ఫాంహౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు. సిట్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొ
Date : 29-01-2026 - 12:33 IST -
మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు
మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
Date : 29-01-2026 - 10:45 IST