HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Paddy Crisis May Deepen In Telangana As Centre Rejects Demands

Paddy Politics : “తెలంగాణ‌” త‌ర‌హా ఉద్య‌మానికి కేసీఆర్ స్కెచ్

కేంద్రంపై దీర్ఘ‌కాలిక పోరాటం చేయ‌డానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు. ఆ మేర‌కు క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌కు సంకేతాలిచ్చాడు.

  • By CS Rao Published Date - 04:47 PM, Mon - 29 November 21
  • daily-hunt

కేంద్రంపై దీర్ఘ‌కాలిక పోరాటం చేయ‌డానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు. ఆ మేర‌కు క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌కు సంకేతాలిచ్చాడు. దేశంలోని ఏ రాష్ట్రానికి లేని వ‌రి కొనుగోలు స‌మ‌స్య ఎందుకు వ‌స్తుందో..తెలియ‌చేయ‌డానికి సన్న‌ద్ధం అవుతున్నాడు. ముడి ధాన్యం మాత్ర‌మే కొనుగోలు చేస్తామ‌ని కేంద్రం తెగేసి చెప్పింది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేద‌ని తేల్చేసింది. దీంతో పార్ల‌మెంట్ వేదిక‌గా టీఆర్ఎస్ ఎంపీలు వ‌రి ధాన్యం కొనుగోలుపై ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌తి రోజూ పార్ల‌మెంట్ లో ఇలాగే ఆందోళ‌న చేయాల‌ని పార్టీ చీఫ్ కేసీఆర్ దిశానిర్దేశం చేశాడు. ఇక క్షేత్ర స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు చేయాల‌ని మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు సంకేతాలిచ్చాడు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ రాబోవు రోజుల్లో మోడీ స‌ర్కార్ మెడ‌లు వంచ‌డానికి సిద్ధం అవుతున్నాడు. జిల్లాల్లో ఆందోళ‌న‌లు, పార్ల‌మెంట్ వేదిక‌గా నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వం ప‌రంగా కేంద్రంపై అధికారిక ఒత్తిడి..ఇలా మూడు మార్గాల ద్వారా కేంద్రాన్ని రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌ని వ్యూహాన్ని ర‌చించాడు. ప్ర‌స్తుతం వ‌రి ధాన్యం కొనుగోళ్లు మంద‌కొడిగా సాగుతున్నాయి. ఖ‌రీఫ్ పంట‌ను ఇంకా కొనుగోలు చేయ‌లేని దుస్థితి. యాసంగి పంట ప్ర‌స్తుతం సిద్ధం అవుతోంది. కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య స్ప‌ష్ట‌మైన వైఖ‌రి లేక‌పోవ‌డంతో రైతులు న‌ష్ట‌పోతున్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలోని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్ ను క‌లిశారు. వచ్చే రబీ నుంచి బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రానికి ఆ టీం తెలియ‌చేసింది.ప్ర‌స్తుతం ఖరీఫ్ సీజన్‌లో ఎంత వరి ధాన్యాన్ని సేకరించాలనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని మంత్రి నిరంజ‌న్ చెప్పాడు. 45 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరిస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రాష్ట్రానికి హామీ ఇచ్చిందని, కేంద్రం ఇప్పుడు ఆ అంశాన్ని తప్పించుకుంటోందని ఆరోపిస్తున్నాడు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందన్న రాష్ట్రం వాదనను కేంద్రం న‌మ్మ‌డంలేద‌ని, శాటిలైట్ సర్వే తర్వాత దీనిని అంగీకరించిందని నిరంజన్ రెడ్డి అన్నారు.ఏడాది పొడవునా రెండు పంటల సేకరణ లక్ష్యాలను నిర్ణయించాలన్న డిమాండ్ ను కేంద్రం త్రోసిబుచ్చింది.వ్యవసాయ సమస్యలపై కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదిత కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించాల‌ని రాష్ట్రం టీం కేంద్ర మంత్రి గోయ‌ల్ ను కోరింది. MSP, వార్షిక వ‌రి కొనుగోలు లక్ష్యం, ప్రత్యామ్నాయ పంటలపై సూచనలతో ముందుకు రావాల‌ని టీం విజ్ఞ‌ప్తి చేసింది.
వ‌రి కొనుగోలు అంశం తెలంగాణ రాజ‌కీయాన్ని మ‌లుపు తిప్ప‌నుంది. కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా వ‌రి కొనుగోలు కేంద్రాల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగుతున్నాయి. ప్ర‌తిగా టీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై దీర్ఘ‌కాలిక పోరుబాట ప‌ట్టాల‌ని యోచిస్తోంది. ఇదే..వ‌చ్చే ఎన్నిక‌ల నాటి ప్ర‌ధాన అస్త్రంగా పార్టీల‌కు మారనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • modi
  • paddy issue

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

Bihar Election Results : బిహార్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సుమారు 64.66 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా చూపిందని విశ్లేషకులు అంటున్నారు.

  • Revanth Mamdani

    Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

Latest News

  • Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd