BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ
- By hashtagu Published Date - 10:54 AM, Mon - 28 November 22
తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో సంజయ్ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. ఈ మేరకు హౌస్ మేషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్ర పర్మిషన్ ఇవ్వడంలేదని పిటిషన్ లో పేర్కొంది. బీజేపీ. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చిన పోలీసులు…ఇప్పుడెందుకు రద్దు చేశారంటూ తీవ్రంగా ఆరోపించింది. అయితే కోర్టు అనుమతించినట్లయితే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. మొత్తానికి ఈ విషయంపై ఇవాళ మధ్యాహ్నం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా షెడ్యూల్ ప్రకారం ఇవాళ బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడ భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా వద్ద బండి సంజయ్ న పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
Related News
SSC: పదో సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్.. వివరాలివే
SSC: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన�