Inter : ఇంటర్ విద్యార్థుల రికార్డ్.. రీవాల్యుయేషన్ కు 40 వేల దరఖాస్తులు!
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్కు 39,039 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,200 మంది విద్యార్థులు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు.
- By Balu J Published Date - 12:55 PM, Fri - 24 December 21
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్కు 39,039 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,200 మంది విద్యార్థులు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో దాదాపు 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో ఈ ఏడాది రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రతి సంవత్సరం, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) రీవాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్ కోసం 15,000 కంటే తక్కువ దరఖాస్తులను స్వీకరిస్తుంది.
టీఎస్బీఐఈ పరీక్షల నియంత్రణాధికారి సుశీల్కుమార్ మాట్లాడుతూ.. మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థుల నుంచి బోర్డు దరఖాస్తులు స్వీకరించేదని, అయితే ఈ ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనపు స్కానర్లను కొనుగోలు చేయడంతో పాటు ఈ ఏడాది 13 రీవాల్యుయేషన్ కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది. జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ డిసెంబరు 24 నుండి ప్రారంభమవుతాయని, ఆ సమాధాన పత్రాలన్నింటినీ స్కానింగ్ చేసి తర్వాత మూల్యాంకన కేంద్రాలకు పంపుతామని సుశీల్ కుమార్ తెలిపారు.
ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులు దొర్లాయని, తప్పుడు ఫలితాలతో విద్యార్థులు చాలా నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Related News
Andhra Pradesh : నేడు విజయవాడలో “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమం.. టెన్త్,ఇంటర్ టాపర్లకు..!
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి టెన్త్, ఇంటర్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం సన్మానం చేస్తోంది. రాష్ట్ర