Hyderabad: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారుతుంది. కానీ గత 24 గంటల్లో నగరంగాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది
- Author : Praveen Aluthuru
Date : 05-09-2023 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారుతుంది. కానీ గత 24 గంటల్లో నగరంగాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదిపై ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల 12 వరద గేట్లను తెరిచి దిగువకు విడుదల చేశారు. నగరంలో సోమవారం నుంచి వర్షం కురుస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను రెండు అడుగుల మేర తెరిచింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇన్ ఫ్లో 1,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,380 క్యూసెక్కులు నమోదైంది.
భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్కు ఎగువ నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జలాశయంలోకి ఇన్ ఫ్లో 4 వేలకు చేరింది. ఆరు క్రెస్ట్ గేట్లను తెరిచి 4,120 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. హిమాయత్ సాగర్ నీటి మట్టం లెవల్ 1,763.50కి చేరుకుంది. జంట జలాశయాల గేట్లను తెరిచిన నేపథ్యంలో మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. మూసీ నది ఒడ్డున ఉన్న చాదర్ఘాట్లోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. మరోవైపు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సులో నీటిమట్టాన్ని జీహెచ్ఎంసీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. హుస్సేన్సాగర్లో 513.42 మీటర్లకు చేరుకుంది
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. నగరం మరియు శివార్లలోని వివిధ ప్రాంతాల నుండి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలు కూడా అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.
Also Read: KCR Survey : 35 మందికి ముడింది.! తేల్చేసిన లేటెస్ట్ సర్వే