MLC Kavitha: కేసీఆర్ ను చూస్తే మోదీకి టెన్షన్…అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు..!!
టీఆరెస్ నేత, ఎమ్మెల్సీ కవిత.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తమకు ప్రమాదం తప్పదని గ్రహించిన బీజేపీ....అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగోల్పుతోందని ఆరోపించారు.
- By hashtagu Published Date - 09:42 AM, Sun - 28 August 22
టీఆరెస్ నేత, ఎమ్మెల్సీ కవిత… ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తమకు ప్రమాదం తప్పదని గ్రహించిన బీజేపీ….అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగోల్పుతోందని ఆరోపించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ శనివారం నిర్వహించిన బిగ్ డిబేట్ కవిత పాల్గొన్నారు.. లిక్కర్ కుంభకోణంలో బీజేపీ తన పేరును లాగడంపై ఆమె స్పందించారు. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని…కేసీఆర్ వాళ్లకు అసలు టార్గెట్ అన్నారు. లిక్కర్ స్కాంలో తనపై వచ్చిన ఆరోపణలను ఎవరూ పట్టించుకోవద్దని…తన కుటుంబ సభ్యులకు…తన తండ్రికి చెప్పానని కవిత అన్నారు. అవసరమైనప్పుడు ఈ విషయం గురించి కేసీఆర్, కేటీఆర్ స్పందిస్తారని చెప్పుకొచ్చారు కవిత.
కేసీఆర్ ను చూస్తే మోదీకి టెన్షన్…అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత….దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని సవాల్ చేశారు. ఇదంత బీజేపీకి కొత్త కాదని…తమకు నచ్చని పార్టీలపై ఇలాగే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవే ఆరోపణలన్నారు.
Source:Abn News Channel
Related News
AP Elections : పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న ఈవీఎంలు.. ఉదయం 7గంటలకే పోలింగ్ షురూ..!
ఆంధ్రప్రదేశ్లోని 4.14 కోట్ల మంది ఓటర్లు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభకు ఏకకాల ఎన్నికల పోలింగ్లో 2,841 మంది అభ్యర్థుల రాజకీయ అదృష్టాన్ని నిర్ణయించనున్నారు.