Hyderabad: మోడీ పర్యటనకు ముందు హైదరాబాద్ లో పోస్టర్లు కలకలం
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం సృష్టించాయి. అవమానించిన రాష్ట్రంలో మోడీ పర్యటించే హక్కు లేదంటూ
- By Praveen Aluthuru Published Date - 11:10 PM, Sat - 30 September 23
Hyderabad: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం సృష్టించాయి. అవమానించిన రాష్ట్రంలో మోడీ పర్యటించే హక్కు లేదంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీకి తెలంగాణాలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ హైదరాబాద్లో మూడు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ఏర్పాటుపై వివిధ సందర్భాల్లో పార్లమెంట్లో మోదీ మాట్లాడుతున్నట్లు పోస్టర్లు చూడొచ్చు.
బిడ్డను రక్షించడం కోసం తల్లిని చంపారు అన్న మోడీ వ్యాఖ్యల్ని ఎత్తిచూపుతూ పోస్టర్లను సృష్టించారు. మోడీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఇప్పటికే ఖండించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని సూచించడం వాస్తవంగా సరికాదు, కానీ అజ్ఞానం మరియు అహంకారంగా కూడా కనిపిస్తుంది అని ఆయన అన్నారు, కాంగ్రెస్ను విమర్శించే ప్రయత్నంలో, మోడీ పదేపదే మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు.
Also Read: Prabhas : సలార్ వల్ల రిలీజ్ గందరగోళం..!
Related News
Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్
ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది.