HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Uttams Harsh Counter To Kcrs Allegations

కృష్ణా జలాల వివాదం, కేసీఆర్ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. “అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్.

  • Author : Sudheer Date : 24-12-2025 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uttam Krishna Water
Uttam Krishna Water
  • కృష్ణా జలాల వ్యవహారం పై కేసీఆర్ కామెంట్స్
  • కేసీఆర్ కామెంట్స్ పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
  • కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి కృష్ణ జలాల వ్యవహారం పై కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు తో కలిసి నీటి విషయంలో తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేసారు. కాగా ఈ ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు.

కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వమే మూలకారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల వాటా ఉండేలా గత ప్రభుత్వం రాతపూర్వకంగా అంగీకరించడం తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడుతున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మౌనంగా ఉండి, పరోక్షంగా వారికి సహకరించిందని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక ఆ పనులను అడ్డుకుని ట్రిబ్యునల్‌లో సమర్థంగా పోరాడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Uttam Kcr Water

గత పదేళ్లలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేకపోయిందని మంత్రి విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాలను పెంచారని, దీనివల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని, ముఖ్యంగా పాలమూరు మరియు నల్గొండ జిల్లాల్లో సాగు నీటి లభ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్లే ఇరిగేషన్ రంగం సంక్షోభంలో పడిందని మంత్రి విశ్లేషించారు.

భవిష్యత్తు ప్రణాళిక మరియు ఎస్ఎల్బీసీ పనులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. వచ్చే మూడేళ్లలో అత్యంత కీలకమైన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనులతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణా జలాల్లో క్యాచ్‌మెంట్ ఏరియా (జలవనరుల పరీవాహక ప్రాంతం) ప్రాతిపదికన తెలంగాణకు 500 టీఎంసీల కంటే ఎక్కువ వాటా రావాలని సుప్రీంకోర్టు మరియు ట్రిబ్యునల్ వేదికగా పోరాడుతున్నామని చెప్పారు. పాలనలో జవాబుదారీతనం పాటిస్తూ, ప్రతి రూపాయిని ప్రజా ప్రయోజనాలకే ఖర్చు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • harish rao
  • jagan
  • kcr
  • kcr krishna water comments
  • Krishna Water
  • uttam counter
  • uttam kumar reddy

Related News

KTR- Harish Rao

BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd