Minister Seethakka : అధికారులను హెచ్చరించిన మంత్రి సీతక్క
- By Sudheer Published Date - 09:37 PM, Fri - 29 December 23
మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Minister Seethakka)..తన మార్క్ చూపిస్తుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవి దక్కినప్పటికీ..తనను మేడం అని కాకుండా.. సీతక్కగానే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందని.. ఎంత ఎదిగినా తాను ప్రజల మనిషినేనని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమన్నారు. ఈమె మాటలు అక్కడి వారినే కాదు రాష్ట్ర ప్రజలను సైతం ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో అధికారులను (Officers) హెచ్చరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజలు తమ సమస్యలతో అధికారుల వద్దకు వస్తే వెంటనే పరిష్కరించాలని, కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. అధికారులంతా నిబద్ధతతో అంకితభావంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని తెలిపారు. క్రింది స్థాయి అధికారులు శాఖ పురోగతికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటానికి తగు సూచనలు, సలహాలను ఇవ్వాలని సూచించారు. గ్రామాలలో అన్ని మౌళికసదుపాయాలను కల్పించాలని, గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు.
Read Also : Anganwadi Workers Protest : ప్రతిసారీ అంగన్వాడీ జీతాలు పెంచుతామని తాము చెప్పలేదు – మంత్రి బొత్స
Related News
TS : జూన్ 9 నుండి చేప ప్రసాదం పంపిణిః బత్తిని కుటుంబం వెల్లడి
Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ(Battini family) సభ్యులు చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం సాగుతుందని బత్తిని కుటుంబం వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground)లో చేపప్రసాదం అందిస్తామని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బత్తిని కుటుంబం వారు తెలి�