Free Bus for Women : ఆటో సంఘాలతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తాం – మంత్రి పొన్నం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ఫై ఆటో డ్రైవర్స్ విమర్శలు చేస్తున్నారు
- By Sudheer Published Date - 01:52 PM, Sun - 10 December 23
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం (Free Bus for Women) ఫై ఆటో డ్రైవర్స్ (Auto Drivers) విమర్శలు చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల తమ బతుకులు ఆగం అవుతాయని..వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఆధారిత వాహనాలపై ఆధారపడి బతుకుబండిని లాగుతున్న డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. కాంగ్రెస్ ఆటో రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)..ఆటో సంఘాల ఆందోళన ఫై స్పందించారు. ఆటో డ్రైవర్ల ఆందోళన ఫై ఆయా సంఘాలతో మాట్లాడుతాం..వారి సమస్యలు పరిష్కరిస్తాం. మహిళకు ఉచిత బస్సు సౌకర్యం ఫై ప్రతి 15 రోజులకు ఓ సారి సమీక్షిస్తాం..లోపాలు సరిచేస్తాం అన్నారు. అవసరమైతే బస్సు సర్వీసులు , రూట్లను పెంచుతాం అని తెలిపారు.
ఇక ‘మహాలక్ష్మి’తో గ్రేటర్లో సుమారు 4లక్షలమంది మహిళా ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాలనుంచి ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, అల్వాల్తోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు రోజూ 1.5లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో 40-50 వేలమంది మహిళా ప్రయాణికులు ఉంటారు. వారంతా ఇకపై ఉచితంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్(Ordinary, Express) బస్సుల్లో ప్రయాణాలు చేయవచ్చు. సోమవారం నుంచి సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాలుంటాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
Read Also : Telangana Ministers : తెలంగాణ లో మిగతా మంత్రులు ఎవరు..?
Related News
Rs 4000 Pension : రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
Rs 4000 Pension : రూ.4వేల ఆసరా పెన్షన్ పంపిణీ ఎప్పటినుంచి ? అనే దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.