CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సీఎం రేవంత్రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసం ఎదుట ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
- By Praveen Aluthuru Published Date - 05:36 PM, Sat - 30 March 24
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసం ఎదుట ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ముఖ్యమంత్రి కార్యాలయం తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై, ఆ వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఈ పనికి యత్నించాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
అయితే ఆత్మహత్యాయత్నం చేసింది కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తనలాంటి వారికి కాంగ్రెస్ లో గుర్తింపు దక్కకపోవడంతోనే అతను ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ పని చేసినట్లు తెలుస్తుంది.
Also Read: BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన జేపీ నడ్డా
Related News
Amit Shah Fake Video: ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపిన సీఎం రేవంత్ రెడ్డి
లోకసభ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపడం రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుంది. సీఎం స్థాయి వ్యక్తి ఎలాంటి నేరారోపణలు లేకుండా ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులు పంపారు. కాగా తాజాగా రేవంత్ ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు. వివరాలలోకి వెళితే..