Malla Reddy: అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారా..? : మల్లారెడ్డి
- By Latha Suma Published Date - 02:33 PM, Sat - 2 March 24
Malla Reddy: ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మున్సిపాలిటీ(Municipality) పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు( road)ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని తాను అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేశానన్నారు.
2,500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయంగా తన స్థలాన్ని నాడు మున్సిపాలిటీకి ఇచ్చానని మల్లారెడ్డి తెలిపారు. కాలేజీ రోడ్డు తొలగించడంతో 25 వేలమంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును ఈరోజు అధికారులు తొలగించారు.
read also : Lok Sabha Election 2024: 200 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు, మూడ్రోజుల్లో ప్రకటన
Related News
Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంలోని ఐదుగురు సభ్యులకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.