KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!
- By hashtagu Published Date - 06:52 AM, Sun - 13 November 22
మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆద్వర్యంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. కొన్ని పరిశోధనాత్మక కథనాలను కేటీఆర్ ఉదహరించారు. గత ప్రభుత్వాలను పడగొట్టారని…ఇవాళ్టి భారతదేశంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కనిపించడం లేదన్నారు.
అదానీ ఒత్తిడి వల్ల 6వేల కోట్ల విలువైన కాంట్రాక్టుకు డిపార్ట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని…శ్రీలంక ఇంధన శాఖ అధిపతి ఆరోపణలు చేసినప్పుడు దేశంలో ఏ మీడియా కూడా వాస్తవాలను ప్రచురించడానికి ముందుకు రాలేదన్నారు. గత 8ఏళ్లగా మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారని ….జర్నలిస్టులతో ప్రధాని మాట్లాడారా అని ప్రశ్నించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రూపాయి, ఉపాధిరేటు, ప్రపంచ ఆకలి సూచి 55 నుంచి 107కి పడిపోయిందని…హలాల్ నాన్ హలాల్ హిజాబ్ వార్తలతో ఆదిపత్యం చేలాయిస్తుందన్నారు.
Minister @KTRTRS participated as Chief Guest at the inaugural session of the national seminar on ‘Media in Telangana: Past, Present and Future’. It is organized by the Department of Journalism and Mass Communication, Dr BR Ambedkar Open University. pic.twitter.com/vXPM5jTciI
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 12, 2022
2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో చాలా మీడియా సంస్థలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశాయని గుర్తు చేశారు. మీడియా నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. అయితే జర్నలిస్టులు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు.
Tags
Related News
KTR: రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ నేతలకు కేటీఆర్ ముఖ్య సూచనలు
KTR: బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలలో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచ