KTR: చేనేత కార్మికుల కోసం మంత్రి కేటీఆర్ వినూత్న పోరాటం..!
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, నేతన్నల ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిన్న పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ నేడు ఆన్లైన్ పిటిషన్ మొదలు పెట్టారు.
- By Gopichand Published Date - 07:06 PM, Sun - 23 October 22
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, నేతన్నల ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిన్న పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ నేడు ఆన్లైన్ పిటిషన్ మొదలు పెట్టారు. మంత్రి కెటీఆర్ ఆదివారం చేనేతపై జిఎస్టికి వ్యతిరేకంగా ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. యాంత్రిక శక్తి సహాయం లేకుండా ప్రత్యేకమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసే దాదాపు 5 మిలియన్ల చేనేత కార్మికులకు భారతదేశం నిలయంగా ఉందని మంత్రి మంత్రి కేటీఆర్ చేంజ్ డాట్ ఆర్గ్లో ఆన్లైన్ పిటిషన్ మొదలుపెట్టారు.
ఉదాత్తమైన లక్ష్యం కోసం చేతులు కలపడం ద్వారా చేనేత రంగాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ పిటిషన్పై సంతకం చేయాలని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవాలని అభ్యర్థిస్తున్నానని మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి పోస్ట్కార్డ్ రాసిన విషయం తెలిసిందే.
భారతదేశంలో చేనేత రంగం కోవిడ్ మహమ్మారి ప్రభావంతో కొట్టుమిట్టాడుతోందని, పన్నును పెంచే ఏ చర్య అయినా ఆ రంగానికి మరణ మృదంగం మోగిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. చేనేత నేయడం అనేది శక్తివంతమైన అంశాలలో ఒకటి. భారతీయ సాంస్కృతిక వారసత్వం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేనేతపై జీఎస్టీ విధిస్తున్న తొలి ప్రభుత్వం బీజేపీయేనని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ప్రచారంలో పాల్గొంటూ జీఎస్టీ విధించడం దేశాభివృద్ధికి విరుద్ధమని అన్నారు.
Related News
Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు.