HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Krmb Board Issue In Telangana Assembly Session

Water Issue : కేసీఆర్ అనుమతితోనే జగన్ కృష్ణా జలాలను తరలించుకొని పోయారు – ఉత్తమ్

  • Author : Sudheer Date : 12-02-2024 - 1:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Assembli Water
Assembli Water

కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్​ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ముందుగా అసెంబ్లీ లో చర్చల ఫై తీర్మానం ప్రవేశపెట్టి, ఆ విషయాలను పవర్​ పాయింట్​ ద్వారా ఎమ్మెల్యేలకు వివరించారు మంత్రి ఉత్తమ్. రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్​పై పోలీసులను పంపించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నదీ జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అందరం ఆశించామని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. రోజుకు 3 టీఎంసీలు ఏపీ అక్రమంగా తరలించుకు వెళుతుందని అన్నారు. పదేళ్ల పాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 219 టీఎంసీలకు బీఆర్​ఎస్​ సర్కారు ఒప్పుకుందన్నారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితోనే AP CM జగన్ కృష్ణా జలాలను తరలించుకుపోయారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కేసీఆర్, జగన్ కు మంచి సంబంధాలున్నాయి. జగన్.. కెసిఆర్ ఇంట్లో బిర్యానీ తిని కృష్ణా నీళ్లు తీసుకెళ్లారు. కెసిఆర్ చాలా గొప్పవారని AP అసెంబ్లీలో జగన్ పొగిడారు. TS జలాలను సైతం APకి ఇస్తున్నారని చెప్పారు. పోతిరెడ్డిపాడు ద్వారా 1987లో 11,500 క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతే 2005లో 44వేలకు, ఇప్పుడు 92,600కు పెంచారు’ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ మాట్లాడుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. ‘బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 50% ఎక్కువ నీరు ఏపీకి వెళ్లింది. పాలమూరు-రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ వైఎస్ హయాంలో 44వేల క్యూసెక్కులు. 2020లో జగన్ 90వేలకు పెంచారు. అయినా కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు’ అని విమర్శించారు. బీఆర్ఎస్​ పాలకులది అసమర్థతనో, అవగాహన లోపమో అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

Read Also : Periods: పీరియడ్స్ సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • krmb board issue
  • telangana
  • water

Related News

Heavy Rain Forecast for Telangana

Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రానికి అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం నెలకొంది. జూన్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా వడగాల్పుల

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

Latest News

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

  • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

  • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

  • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

  • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd