Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజీనామా..!
ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) రాజీనామా చేశారు.
- By Gopichand Published Date - 08:14 PM, Mon - 11 December 23
Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) రాజీనామా చేశారు. సోమవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను అందించారు. 2019లో వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా పదవి చేపట్టడంతో ఎంపీ పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Also Read: Chiranjeevi Visits Yashoda Hospital : కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి
ఎంపీ పదవికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజీనామా.
Telangana Minister Komatireddy Venkat Reddy resigns from the post of MP.#Komatireddy @KomatireddyKVR pic.twitter.com/acv4zOl0X5
— Congress for Telangana (@Congress4TS) December 11, 2023
సోమవారం సాయంత్రం 5.30గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర అధికారులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సాయం అందించాలని చెప్పారు. హైదరాబాద్ – విజయవాడ రహదారిని ఆరు లైన్లకు విస్తరించే చర్యలు చేపట్టాలని నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. అంతకముందు మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున పార్లమెంటు సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. చెప్పిన మాట ప్రకారం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
Tags
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.