Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్
- By Sudheer Published Date - 09:33 PM, Tue - 12 March 24
రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ‘కథనభేరి’ (Kadana Bheri) వేదిక ఫై కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి. అందర్నీ చైతన్యం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సభలో కేసీఆర్ (KCR) మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమస్యలు వస్తున్నయో అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్ భగీరత పథకం తీసుకొచ్చి..బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథాకాన్ని నడిపే తెలివిలేదా..? ఎందుకు మిషన్ భగీరథలో సమస్యలు వస్తున్నయ్..?’ అని ప్రశ్నించారు. నేను సీఎం అయినప్పుడు ఏడాదినర్థం తిరగకుండానే కరెంటు పరిస్థితిని చక్కదిద్దినం. ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినం. దాంతో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు వచ్చింది. రైతు బంధు ఇచ్చినం. కరోనా వచ్చి కాటేసినా రైతుబంధు ఆపలే. ఇయ్యాల ఆ రైతుబంధు ఏసుడు చేతనైతలేదా..? కేసీఆర్ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్జేసినట్టు కరెంటు బందైతదా..? మేం తొమ్మిదేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్తలేదా..?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ నాయకుల పాలనలో బోనస్ బోగస్ గా మారిపోయిందని కేసీఆర్ ఆరోపించారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు, పశువులను మేపుతున్నారు.. గ్రామాల్లో మీరంతా చర్చ పెట్టాలని కేసీఆర్ తెలిపారు.. బీఆర్ఎస్ తెలంగాణా గళం, దళం, బలం అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తే.. తాము రైతు బంధు వేయకున్నా, కరెంటు, నీళ్లు ఇవ్వకపోయినా గెలిపిస్తారని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటారన్నారు. కాంగ్రెస్ వాళ్ల నైజం అది.. మనం చూడని కాంగ్రెస్ ప్రభుత్వమా అని వ్యాఖ్యానించారు.
ఇక బిజెపి ఫై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ఒక నవోదయ స్కూల్ గానీ, ఒక మెడికల్ కాలేజీ గానీ ఇవ్వని మోదీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారని ప్రశ్నించారు. రూ.5 పని కూడా చేయలేదని విమర్శించారు. అంతకుముందు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఎన్నో పనులు చేశారని అన్నారు. బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు ఎంత తేడా ఉందో గమనించాలని కేసీఆర్ అన్నారు.
Read Also : KCR : రెండు పిల్లర్లు కుంగితే..కాంగ్రెస్ దేశం కొట్టుకుపోయినట్టు చేస్తుంది – కెసిఆర్
Related News
AP Elections : పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న ఈవీఎంలు.. ఉదయం 7గంటలకే పోలింగ్ షురూ..!
ఆంధ్రప్రదేశ్లోని 4.14 కోట్ల మంది ఓటర్లు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభకు ఏకకాల ఎన్నికల పోలింగ్లో 2,841 మంది అభ్యర్థుల రాజకీయ అదృష్టాన్ని నిర్ణయించనున్నారు.