Telangana Politics:అదే జరిగితే టీ కాంగ్రెస్ క్లోజ్?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి కమ్యూనిస్టుల భుజం మీద కెసిఆర్ తుపాకీ పెడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రగతిభవన్లో సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో కేసీఆర్ భేటీ వెనుక మాస్టర్ స్కెచ్ లేకపోలేదు.
- By CS Rao Published Date - 10:37 AM, Sun - 9 January 22
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి కమ్యూనిస్టుల భుజం మీద కెసిఆర్ తుపాకీ పెడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రగతిభవన్లో సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో కేసీఆర్ భేటీ వెనుక మాస్టర్ స్కెచ్ లేకపోలేదు. నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలని 2018 నుంచి ఆయన చెబుతున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ అప్పుడప్పుడు టూర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లడం చూసాం. కానీ ఆయన పొలిటికల్ ఎత్తుగడలు సహజంగా తెలంగాణలో అధికారం కోసం ఉంటుంది. మళ్ళీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి ఎలా రావాలి అనేది ఆయన మొదటి ప్రాధాన్యం ఉంటుందని అందరికి తెలిసిందే.
టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఈసారి ఎక్కువగా ఉంటుందని ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. దుబ్బాక, గ్రేటర్, హుజురాబాద్ ఫలితాలు ఈసారి అధికారంపై అనుమానం కలిగిస్తున్నాయి. అందుకే 2023 స్కెచ్ ని గెలుపు దిశగా కాంగ్రెస్ మీదుగా తయారు చేస్తున్నాడని అర్ధం అవుతోంది. ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ఆలోచిస్తే రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడని శనివారం ప్రగతిభవన్లో భేటీ చెబుతుంది. గతంలోనూ అంటే 2009 ఎన్నికల్లో మహాకూటమి రూపంలో కామ్రేడ్లతో కలసి టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళింది. చాలా చోట్ల టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో లాభపడింది. ఆ అనుభవంతో కమ్యూనిస్టు పెద్దలతో కేసీఆర్ మాటలు కలిపాడ ని టాక్.
నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇప్పటికే మమత దూకుడుగా ఉంది. ఆమెకు ప్రశాంత్ కిశోర్ కూడా మద్దతుగా సలహాలు ఇస్తున్నాడు. ఎన్సీపీ నేత శరద్ పవార్ లాంటి వాళ్ళతో ఆమె భేటీ జరిగింది. ఆ తరువాత యుపిఏ అనేది ముగిసిన ఎపిసోడ్ గా ప్రచారం చేశారు. కానీ దానిపై రివర్స్ అటాక్ జరిగింది. దీంతో మళ్ళీ కాంగ్రెస్ తో కూడిన యూపీఏ దిశగా ప్రశాంత్ కిశోర్ ఇటీవలి ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కెసిఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయటం హాట్ టాపిక్ గా ఉంది.
Also Read: కాంగ్రెస్ పై `కేసీఆర్` వేట
ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ భేటీ అయ్యాడు. కానీ ఆయన కాంగ్రెస్ ను వీడి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఆ భేటీ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నంలో భాగం కాదని కూడా టాక్ ఉంది. ఇక కేసీఆర్ ను కమ్యూనిస్టు అగ్రనేతలు కలవటం చాలా సీరియస్ ఇష్యూ. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ని కాదని కామ్రేడ్ లు కేసీఆర్ పంచన చేరే అవకాశం లేదు. జాతీయ స్థాయి సమీకరణాల కోణంలోనే అగ్రనేతలు ఆలోచిస్తారు. రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు పొత్తు ల రూపంలో త్యాగం చేసారు. అలాంటిదే 2009 పొత్తు కూడా. మరి ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి కమ్యూనిస్టులు నడుస్తున్నారు. సోనియా నిర్వహించిన మీటింగ్ లకు మిస్ కాకుండా వెళ్తారు. అదే సమయం లో మమత కు కామ్రేడ్లతో పొత్తు కుదరదు. ఇవన్నీ గమనిస్తే కేసీఆర్ ను ముందుంచి కామ్రేడ్లు కథ నడిపిస్తున్నారని అర్థం అవుతుంది. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ , టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పొత్తుకు వెళ్లే అవకాశానికి తెరలేపారని తెలుస్తుంది.
ఏపీలో ఇప్పటికే కామ్రేడ్లు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ తో కలసి నడుస్తున్నారు. జనసేన కూడా దగ్గర అవుతుంది . మొత్తంగా కాంగ్రెస్, జనసేన, టీడీపి, కమ్యూనిస్టు లు కూటమి ఏపీలో 2024 దిశగా వెళ్లే చాన్స్ కు ఢిల్లీ కమ్యూనిస్టు పెద్దలు స్కెచ్ వేశారని వినికిడి. ఇక తెలంగాణలోనూ టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూటమికి లైన్ క్లియర్ చేయడానికి ప్రగతిభవన్లో భేటీ జరిగిందని టాక్.
Also Read: ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?
కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు కూడా చాలా కాలంగా పొత్తు దిశగా వెళ్లే అవకాశం ఉందని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా లీకులు వదిలిన సందర్భాలు లేకపోలేదు. కోవర్ట్ లు గా కొందరు సీనియర్లను రేవంత్ వర్గం భావిస్తుంది.వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేస్తున్నారని ఢిల్లీ వర్గాల టాక్. అందుకు బలం చేకూరేలా ప్రగతి భవన్ మీటింగ్ ఉందని విశ్లేషకుల అంచనా. అదే జరిగితే 2023లోనూ తెలంగాణ కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం ఎండమావే అవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తో కూడిన కూటమి ఏర్పాటు చేస్తే , సరి. లేదంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా ఏపీ కాంగ్రెస్ మాదిరిగా అయ్యే ప్రమాదం లేకపోలేదు. సో..కమ్యూనిస్టుల భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ కాంగ్రెస్ నుపై కేసీఆర్ గురి పెట్టడన్నమాట.
Related News
TG Lok Sabha Polling : పార్లమెంట్ ఎన్నికల్లో 12 , 14 సీట్లు సాదించబోతున్నాం – భట్టి
తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. 17 స్థానాలకు సంబదించిన పోలింగ్ లో ఓటర్లు పెద్దత్తున కాకపోయినా పర్వాలేదు అనిపించేలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రజలు మాకంటే మాకు మద్దతు తెలిపారని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)..ఎన్నికల్లో 12 నుండి 14 సీట్లు సాదించబోతున్న