HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Postcard To Sonia Criticises Revanth Bc Reservations

MLC Kavitha :ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై మరోసారి సునిశిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌ పోస్టాఫీస్ ఎదురుగా ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డు రాసి, ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడించారు.

  • Author : Kavya Krishna Date : 25-06-2025 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Kavitha Fire
MLC Kavitha Fire

MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై మరోసారి సునిశిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌ పోస్టాఫీస్ ఎదురుగా ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డు రాసి, ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, “ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ పరిపాలనపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమే” అని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తాను కలలో కూడా రాష్ట్రానికి నష్టం చేయలేదని, ఆయన ధైర్యాన్ని కాంగ్రెస్ నాయకులు బాగా గుర్తించారని చెప్పారు. “కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు” అంటూ వ్యాఖ్యానించారు.

కవిత వ్యాఖ్యల్లో రేవంత్ రెడ్డి పాత్రపై తీవ్ర విమర్శలు కనిపించాయి. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజాభవన్‌కు ఆహ్వానించి హైదరాబాద్ బిర్యానీ తినిపించింది రేవంత్ రెడ్డి. గోదావరి నీటిని గిఫ్ట్ ప్యాక్‌లో కట్టి ఆయనకు ఇచ్చారు,” అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో బనకచర్ల ప్రాజెక్ట్ విషయమై ఎలాంటి చర్చలు జరగలేదని, ఎక్కడా సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఆమె స్వాగతించారు. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు ఇచ్చిన గడువులోగా ప్రభుత్వం జీఓ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి. ఇలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదు” అని ఆమె స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bc reservations
  • brs
  • Congress Government
  • Godavari Water Issue
  • kalvakuntla kavitha
  • Postcard Protest
  • revanth reddy
  • sonia gandhi
  • Telangana Assembly
  • telangana politics

Related News

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd