Kasani : రేపు బీఆర్ఎస్లో చేరనున్న కాసాని.. గోషామహల్ నుంచి పోటీ..?
టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ రేపు బీఆర్ఎస్లో చేరనున్నారు. రేపు ఉదయం 11.30 గం.లకు కాసాని
- By Prasad Published Date - 06:13 PM, Thu - 2 November 23
టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ రేపు బీఆర్ఎస్లో చేరనున్నారు. రేపు ఉదయం 11.30 గం.లకు కాసాని బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరనున్నారు. అయితే కాసాని మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ని కోరినట్లు సమాచారం. కుత్భుల్లాపూర్ నియోజకవర్గం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖారారు కావడంతో కాసానిని గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. రేపు కాసాని చేరిన తరువాత ఒకటి రెండు రోజుల్లో గోషామహల్ అభ్యర్థిగా కాసానిని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో అసంతృప్తితో కాసాని జ్క్షానేశ్వర్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితులు కారణంగా పోటీ చేయవద్దని చంద్రబాబు కాసానికి తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ములాఖత్ అయిన కాసాని పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయలేమని చంద్రబాబు తేల్చి చెప్పడంతో కాసాని టీటీడీపీకి రాజీనామా చేశారు.
Related News
SSC: పదో సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్.. వివరాలివే
SSC: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన�