Kishan Reddy: కల్వకుంట సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది: కిషన్ రెడ్డి
ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
- By Balu J Published Date - 05:38 PM, Fri - 7 July 23
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్ అయిన విషయం తెలిసిందే. అయితే రేపు ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇక చారిత్రాత్మకమైన వరంగల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వస్తున్నారన్నారు. రూ.6,109 కోట్లు జాతీయ రహదారులకు, రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు మోడీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. తొలి దశలో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తున్నామని.. దీని వల్ల 3వేల మందికి ఉద్యోగా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందుకు తాను ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
హన్మకొండ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు లాంటివని.. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఏనాడూ కాంగ్రెస్తో గానీ, బీఆర్ఎస్తో గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. కానీ . గతంలో ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయని, ప్రభుత్వాన్నీ పంచుకున్నాయని అన్నారు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా బీజేపీపై అబద్ధాలు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కల్వకుంట సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వచ్చే ఎన్నికలలో ఆ కుటుంబ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం కమిషన్ల, వాటాల ప్రభుత్వంగా మారిందని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ప్రభుత్వంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని బహుళజాతి కంపెనీలకు భారత్ కేరాఫ్ అడ్రస్గా మారిందని అన్నారు.
Also Read: Chiranjeevi: భార్య సురేఖతో కలిసి చిరు వెకేషన్.. ఫొటోలు వైరల్
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది