HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Investigation Into Gachibowli Lands High Court Notices To Respondents

HCU Lands Issue : గచ్చిబౌలి భూములపై విచారణ ..ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు

. అందుకు సంబంధించి టీజీఐఐసీ ప్రకటన సైతం విడుదల చేసింది. కానీ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, అటవీ భూములు అని వన్య ప్రాణులను రక్షించాలని.. భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోలేం అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.

  • Author : Latha Suma Date : 07-04-2025 - 1:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Investigation into Gachibowli lands..High Court notices to respondents
Investigation into Gachibowli lands..High Court notices to respondents

HCU Lands Issue : తెలంగాణ హైకోర్టు వివాదాస్పద కంచ గచ్చబౌలి భూములపై విచారణను వేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. అందుకు సంబంధించి టీజీఐఐసీ ప్రకటన సైతం విడుదల చేసింది. కానీ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, అటవీ భూములు అని వన్య ప్రాణులను రక్షించాలని.. భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోలేం అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కౌంటర్, రిపోర్ట్ ఈ నెల 24లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24కు పిటిషన్ల విచారణకు వాయిదా వేసింది. కాగా, కంచ గచ్చిబౌలి భూ వివాదంఫై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆ 400 ఎకరాలలో చెట్ల నరికి వేతపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూములపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీంతో ఏప్రిల్ 24కు 400 ఎకరాల భూములపై దాఖలైన పిటిషన్లను విచారణ వాయిదా వేసింది.

ఇకపోతే.. కంచ గచ్చిబౌలి భూముల ఫేక్ ప్రచారాని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రచారం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఏఐ జనరేటెడ్‌ ఫొటోలు, వీడియోలతో వివాదం ముదిరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం అవగాహనా లేకుండా, మ్యాటర్ తెలుసుకోకుండా కొందరు సెలబ్రిటీలు సైతం అది హెచ్‌సీయూ భూమి అని నమ్మి వీడియోలు చేయడం బాధాకరం అన్నారు. అది ప్రభుత్వం భూమి అని, కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం చేపిస్తున్న ఫేక్ ప్రచారంతో వివాదం ముదురుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈవిషయం ఇప్పుడు జాతీయస్థాయికి వెళ్లింది.

Read Also :  Adavi Thalli Bata : పవన్ ‘అడవితల్లి బాట’ తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • Counter filing
  • HCU Lands Issue
  • respondents
  • telangana government
  • Telangana High Court

Related News

Kavitha

BRS తరహాలో ఉద్యోగాలు అమ్ముకోకండి అంటూ కాంగ్రెస్ కు కవిత సూచన !!

రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలు ఎలా ఉన్నప్పటికీ, అంతిమంగా నష్టపోయేది నిరుద్యోగ యువతేనని ఈ కథనం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగాల భర్తీపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఎలాంటి పైరవీలకు తావులేకుండా నియామకాలు చేపట్టాలని కవిత కోరారు

  • Group 1 Telangana High Court

    గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Kcr Nandinagar

    Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

Latest News

  • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

  • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

Trending News

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

    • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd