Viral News : ఇండిగో ఫ్లైట్లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం ..స్పందించిన మంత్రి కేటీఆర్..!!
ఇండిగో ఫ్లైట్ లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
- By hashtagu Published Date - 11:51 AM, Mon - 19 September 22
ఇండిగో ఫ్లైట్ లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈనెల 16 వ తేదీన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళకు ఇంగ్లీష్, హిందీ రాదన్న కారణంలో ఫ్లైట్ లో ఆమె సీటు మార్చడాన్ని తప్పు పడుతూ ట్విట్టర్ లో ఓ ప్రెఫెసర్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇండిగో సిబ్బందిని ట్యాగ్ చేస్తూ…హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడటం రానంత మాత్రాన వాళ్లను అవమానపర్చడం సరికాదని ట్వీట్ చేశారు. ప్రాంతీయ భాషను మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలంటూ ఇండిగోకు సూచించారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ఇండిగో ఫ్లైట్ సర్వీసు సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Indigo 6E 7297. Vijayawada (AP) to Hyderabad (Telangana), Sept 16-2022. The woman in green originally sitting in 2A (XL seat, exit row) was forced to seat 3C because she understood only Telugu, not English/Hindi. The attendant said it's a security issue. #discrimination @IndiGo6E pic.twitter.com/bHa8hQj5vz
— Devasmita Chakraverty, PhD, MPH (@DevasmitaTweets) September 17, 2022
Related News
KTR: తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని, 2001 లోనే హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్ అని, గెలిచినా, ఓడినా కేసీఆర్ తో ఒక సోదరుడిలా వెన్నంటే ఉన్న నాయకుడు పద్మారావు గౌడ్ అన�