Rachakonda: రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన నేరాలు.. క్రైమ్ రేట్ ఇదే!
- By Balu J Published Date - 04:29 PM, Wed - 27 December 23
Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి.
పిల్లలపై లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాప్ల కేసులు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మందిని అరెస్టు చేశారు. ఆరుగురిపై పీడీ యాక్ట్ పెట్టారు. గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదు చేసి 972 మందిని అరెస్టు చేశారు. ఏడాది కాలంలో 5,241 నేరాలకు సంబంధించి శిక్షలు ఖరారు చేశామన్నారు. శిక్షల రేటు 62 శాతం పెరిగిందన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడింది.
సైబర్ నేరాలలో 42 మంది అంతర్రాష్ట్ర, విదేశీ నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.89.92 లక్షల నగదును స్తంభింపజేసి బాధితులకు అందజేశారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 64 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 136 మంది చిన్నారులను రక్షించారు. 21 బాల్య వివాహాలను నిలిపివేశారు. మెట్రో రైళ్లలో 730 డెకాయ్ ఆపరేషన్లు జరిగాయి. కాగా.. 2,900 డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేసినట్లు డీజీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి ఈ ఏడాది 3,321 ప్రమాదాలు జరగ్గా 633 మంది మరణించారు. అలాగే, 3,205 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం పెరిగాయి. సామాజిక మాధ్యమాల్లో 8,758 ఫిర్యాదులు రాగా, 4,643 పరిష్కరించినట్లు సీపీ సుధీర్బాబు తెలిపారు.
Related News
Rachakonda CP: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు- రాచకొండ సిపి సుధీర్ బాబు
Rachakonda CP: బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పో�