1 Kiled : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికాలోని కాన్సాస్లోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి చెందింది. బిజినెస్ ఎనాలిసిస్లో
- By Prasad Published Date - 11:36 AM, Wed - 18 October 23
అమెరికాలోని కాన్సాస్లోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి చెందింది. బిజినెస్ ఎనాలిసిస్లో మాస్టర్స్ చదువుతున్న 24 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని ప్రతీక్షా కున్వర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది . ప్రతీక్ష సోదరి.. ప్రతిభా కున్వర్ తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 15వ తేదీ రాత్రి ప్రతీక్ష, తన సోదరి ప్రియాంక, స్నేహితుడు సాయి తేజ, డ్రైవర్ వరుణ్తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ స్టాప్ సిగ్నల్ను పాటించకపోవడంతో ఇతర వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రతిభ వివరించారు. ఈ ప్రమాదంలో సాయితేజ, ప్రియాంకలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రతీక్ష అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతీక్ష పార్థివదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం లేదా సోమవారాల్లో భౌతికకాయం హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని కుటుంభసభ్యులు భావిస్తున్నారు. హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. యుఎస్ వెళ్లే ముందు ప్రతీక్ష హైందవి కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. హైదరాబాద్లోని నారాయణగూడలో కుటుంబంతో కలిసి నివాసముండేది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. దురదృష్టవశాత్తు, చాలా మంది విద్యార్థులు ఇంతకు ముందు రోడ్డు ప్రమాదాలలో మరణించారు.
Also Read: TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC లక్కీ డ్రా షురూ!
Related News
Heavy Rain In HYD : సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ ఎస్ ఏ ఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు