Ganja : అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాని పట్టుకున్న పోలీసులు
ఎల్బీ నగర్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల సంయూక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాని పట్టుకున్నారు.
- By Prasad Published Date - 07:19 PM, Fri - 4 August 23
ఎల్బీ నగర్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల సంయూక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.3000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పెరుమాళ్ల రజనీకాంత్, మహ్మద్ సమీర్, వూట్కూరి సాథ్విక్ రెడ్డి, తోడేటి వంశీ, గాడిపల్లి హేమంత్, తిరుపతిగా గుర్తించారు. నల్గొండ నకిరేకల్ లో నివాసముంటున్న పెరుమాళ్ల రజనీకాంత్ అనే విద్యార్థి డ్రగ్స్కు బానిస అయ్యాడు. మహ్మద్ సమీర్ అనే వ్యక్తితో రజనీకాంత్ఖు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది.ఇద్దరు కలిసి గంజాయిని సేకరించి విద్యార్థులకు విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ని వర్కవుట్ చేయడానికి వనస్థలిపురం మార్కెట్ నుండి రాచకొండ పోలీసు ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్కు చెందిన మోటర్బైక్ను దొంగిలించారు.అక్కడి నుంచి వీరిద్దరూ ఒడిశాకు వెళ్లిపోయారు. అక్కడ వారు మల్కన్గిరి జిల్లా చిత్రకొండ నుండి రూ. 3000 విలువైన 5 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు వూట్కూరి సాథ్విక్ రెడ్డి, తోడేటి వంశీ, గాడిపల్లి హేమంత్ల ద్వారా విద్యార్థులకు గంజాయిని విక్రయించేవారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Related News
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.