PM Modi : పేరేడ్ గ్రౌండ్స్ లో `మోడీ` బహిరంగ సభ
ప్రధాని మోడీ బహిరంగ సభకు పేరేడ్ గ్రౌండ్ ను ఫిక్స్ చేశారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో జూలై 3న ఆయన ప్రసంగించనున్నారు.
- By CS Rao Published Date - 06:15 PM, Wed - 15 June 22
ప్రధాని మోడీ బహిరంగ సభకు పేరేడ్ గ్రౌండ్ ను ఫిక్స్ చేశారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో జూలై 3న ఆయన ప్రసంగించనున్నారు. సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి బూత్ నుండి 30 నుండి 50 మంది వ్యక్తులను సమీకరించాలని రాష్ట్ర బిజెపి పార్టీ లక్ష్యంగా పెట్టింది. బహిరంగ సభలను నిర్వహించడంలో నిపుణులైన 119 మంది ‘విస్తారక్లను’ దేశవ్యాప్తంగా నియమించారు. వాళ్ల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సభ జరగబోతుంది.
ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ (TNIE) నివేదిక ప్రకారం, ప్రతి కార్యకర్త రూ. 1,000 విరాళంగా ఇవ్వాలని పార్టీ అభ్యర్థిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభల కోసం నిధులను సేకరించేందుకు సన్నద్ధం అయింది. కొన్ని వారాల క్రితం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20 సంవత్సరాల పూర్తిలో పాల్గొనేందుకు ప్రధాని హైదరాబాద్ను సందర్శించారు. 2022 తరగతి స్నాతకోత్సవంలో కూడా ఆయన ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన గతంలో తెలంగాణ కోసం “వాగ్దానాల” గురించి ప్రశ్నిస్తూ పలు పోస్టర్లు వెలిశాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా హైదరాబాద్ మీద రాజకీయం కేంద్రీకృతం అయింది. ఆ సమావేశాల్లో తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కొంత ఇబ్బంది కరంగా ఉంది. ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు, అవినీతి , కుటుంబ రాజకీయ రాజ్యం ఏలుతుంది. వీటన్నింటిపై సీరియస్ గా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికలకు వెళ్లాలనే బ్లూ ప్రింట్ కూడా హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ తయారు చేయనుంది.
Related News
PM Modi Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. బైడెన్ తో కీలక అంశాలపై చర్చ..!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (PM Modi Visit)లో ఉన్నారు. ఆయన పర్యటన భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.