Hyderabad: హైదరాబాద్ లో భానుడి భగభగలు.. బేగంపేటలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
- By Balu J Published Date - 03:48 PM, Sat - 2 March 24
hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఫలితంగా నగర ప్రజలు ఉక్కపోతతో పాటు ఎండవేడిమితో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని బేగంపేట (38.6 ° C) సరూర్నగర్ (38.3 ° C) లలో 38 ° సెల్సియస్ను దాటాయి. ఇక కార్వాన్ (37.7°C), జూబ్లీహిల్స్ (37.6°C), యూసుఫ్గూడ (37.6°C)లు GHMC పరిధిలోని టాప్ 5 హాటెస్ట్ ఏరియాల్లో 37 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ను తాకే అవకాశం ఉంది. GHMC పరిధిలో, గరిష్ట ఉష్ణోగ్రతలు 34° నుండి 36°C వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21°C నుండి 23°C వరకు ఉండవచ్చు.
హైదరాబాద్ వేసవిలో ముఖ్యంగా మార్చి, ఏప్రిల్లలో తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ మార్చి ప్రారంభంలోనే ఎండలు కొడుతున్నాయి. విపరీతమైన వేడి కారణంగా వడదెబ్బ, ఇతర అనారోగ్య సమస్యలు తల్తెతే అవకాశం ఉంది. దీర్ఘకాలిక మూత్రపిండ, గుండె జబ్బులు, మధుమేహం లాంటి లక్షణాలు జనాలకు ఇబ్బందులకు గురిచేస్తాయి.
హైదరాబాద్లో వేసవి లో చాలా కూల్ గా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా మంచినీరు తాగాలి. ఎయిర్ కండిషనింగ్, ఫ్యాన్లు లేదా ఏసీలను వాడుకొని శరీరాలను చల్లబర్చుకోవాలి. ఇక కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లాలి.
Related News
Cyberabad: డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
Cyberabad: సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, కూకట్పల్లి పోలీస్ లు కూకట్పల్లి స్టేషన్ పరిధిలో ని శేషాద్రినగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 3 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. బెంగళూరు లో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది కూకట్ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. మరొ