Hawala racket: హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు..!
హవాలా రాకెట్ నడుపుతున్న ఐదుగురిని టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు.
- By Gopichand Published Date - 03:44 PM, Sun - 23 October 22
హవాలా రాకెట్ నడుపుతున్న ఐదుగురిని టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం సెంట్రల్ జోన్ పోలీసుల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ కమిషనర్ ట్రూప్ బజార్ వద్ద హవాలా రాకెట్ను నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులను కాంతిలాల్, పెప్ సింగ్, కిషోర్ సింగ్, మహమ్మద్ అబ్దుల్ ఫరీద్, సందీప్ సింగ్లుగా గుర్తించారు. నిందితుల నుంచి రూ. 63,50,000 నగదుతో పాటు యాక్టివా, ఐదు మొబైల్ ఫోన్లు, క్యాషియర్ మిషన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రానుజ మార్కెట్ లోని ఎలక్ట్రికల్ గోడౌన్పై దాడి చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. డబ్బును బ్యాగులో, పాలిథిన్ కవర్లో ఉంచారు. గోడౌన్ యజమాని కాంతి లాల్.. పరారీలో ఉన్న జోగ్ సింగ్తో కలిసి హవాలా వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఆదివారం ఉదయం కాంతి లాల్ సింగ్.. ఫరీద్, సందీప్లకు రూ. 42 లక్షలు అందజేసి, కిషోర్ నుండి రూ.21.5 లక్షలు అందుకున్నాడు. దిలీప్ అనే వ్యక్తి పరారీలో ఉండడం గమనార్హం.
పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం డబ్బు.. సింగ్ ఆదేశాల మేరకు లావాదేవీలు జరగాల్సి ఉంది. కాంతి లాల్ ఆ మొత్తాన్ని కలిగి ఉండటానికి గల కారణాన్ని తెలియజేయడంలో విఫలం కావడంతో నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ కోసం అఫ్జల్ గంజ్ PSకి టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పగించారు.
Related News
Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.