HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Raos Powerpoint Presentation On The Kaleshwaram Project

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వాస్తవాలతో హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి అంగీకారాన్ని తీసుకువచ్చామని చెప్పారు.

  • Author : Latha Suma Date : 07-06-2025 - 1:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao's PowerPoint presentation on the Kaleshwaram project
Harish Rao's PowerPoint presentation on the Kaleshwaram project

Kaleshwaram : మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిన నేపథ్యంలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అసత్యమని, అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు ఖండించారు. తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి అంగీకారాన్ని తీసుకువచ్చామని చెప్పారు. కాళేశ్వరం అనేది కేవలం ఒక బ్యారేజ్‌ కాదు.

Read Also: Sugavasi Balasubramanyam : టీడీపీకి గుడ్ బై చెప్పిన సుగవాసి బాలసుబ్రమణ్యం

ఇది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌసులు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన బహుళ గుణిత ప్రాజెక్టు. మొదట తమ్మిడిహట్టి వద్ద నీరు ఎత్తిపోసేలా ప్రాజెక్టును రూపొందించాం. అయితే అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్పు చేశాం అని వివరించారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా, మొత్తం 85 పియర్లతో నిర్మించామని, ఈ నిర్మాణం క్రమంగా పూర్తికావడంలోనే కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నా, దీని ఆధారంగా మొత్తం ప్రాజెక్టుపై నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం వల్లే యాసంగిలో కూడా పంటలు పండాయని, ప్రస్తుతం మల్లన్నసాగర్‌ వరకు నిర్మించిన సౌకర్యాలు పూర్తి వినియోగంలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు వేర్వేరు వనరుల నుంచి నీటిని సేకరించి వేలాది చెరువులను నింపగలగడం జరుగుతోందన్నారు. అంతేకాక, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించబడినప్పటికీ ఇప్పటివరకు 400 టీఎంసీలకు మించకుండా మాత్రమే వాటిని వినియోగిస్తున్నామని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అనుమతులు పొందకుండా, నిర్మాణం ప్రారంభించకుండానే కాలువలు తవ్వడం ప్రారంభించారని విమర్శించారు. 2007లో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, 2011 నాటికి అది రూ.40 వేల కోట్లకు పెంచిన వాస్తవం ప్రజలు మరిచిపోకూడదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు వచ్చిన సవాళ్లను రాజకీయంగా వాడుకోవడం కాకుండా, అవే దుర్బలతలుగా గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించడం అవసరమని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఆయన సూచించారు.

Read Also: Delhi : ఢిల్లీ విమానాశ్రయంలో ఈనెల 15 నుంచి రోజుకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress leaders
  • harish rao
  • kaleshwaram project
  • Medigadda barrage
  • Powerpoint Presentation

Related News

Changes in Congress's action on National Employment Guarantee.

జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, గ్రామీణ కార్మికులకు సరైన పనిదినాలు కల్పించడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ నిరసనల ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

  • Vote Chori Rally

    Vote Chori : ‘ఓట్ చోరీ’పై ఈరోజు కాంగ్రెస్ మెగా ర్యాలీ

  • Revanth Reddy Became A Pois

    Gurukul Hostel Food : గురుకుల పాఠశాల విద్యార్థులుకు విషంగా మారిన రేవంత్ – హరీశ్ రావు

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd