Telangana : ఇది శ్వేత పత్రం కాదు.. అబద్దపు పత్రం – హరీష్ రావు
- By Sudheer Published Date - 01:38 PM, Sat - 17 February 24
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో సభలో ‘శ్వేతపత్రం’ (White Paper) రిలీజ్ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్నీ అసత్యాలే తెలిపారని హరీష్ పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రం ఫై సుదీర్ఘంగా ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చెప్పారని .. కానీ ఇంత మంచి విషయం 30 నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదని, కనీసం తనకు 2 గంటలైనా సమయం కేటాయించాలని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు. శ్వేతపత్రాన్ని ఇప్పుడే ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో 4 సత్యదూరమైన అంశాలు గుర్తించా. మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయన్నది అసత్యం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసిందే మేము’ అని హరీశ్రావు స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇది శ్వేత పత్రం కాదని.. అబద్దపు పత్రమని కామెంట్ చేశారు. మిడ్మానేరు విషయంలో మంత్రి చెప్పిందంతా అబద్దమని అన్నారు. 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిడ్మానేరు, ఎల్లంపల్లి తమ హయాంలో పూర్తైందన్నారు. ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో పూర్తి అయ్యాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇకపై పోటీ చేసి సభలో అడుగు పెట్టబోనని సవాల్ చేశారు.
కాంగ్రెస్ తెలిపిన మొదటి అబద్దం :
మిడ్ మానేర్ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారు. కాలేదు. అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక 775 కోట్లు మేము పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం.
రెండో అబద్ధం :
ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారు. ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారు.
మూడో అబద్దం :
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి పిర్యాదు చేయలేదు అన్నారు. తప్పు అది. 5- 5- 2020 జీఓ నాడు వచ్చింది. అయితే జనవరి లోనే మేము కేంద్రానికి ఫిర్యాదు చేశాము.
నాల్గో అబద్దం :
కెఆర్ఎంబికి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదు అని పేజీ 14 లో చెప్పారు. అది తప్పు మేము వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పాము.
ఐదో అబద్దం :
కెఅర్ఎంబి కి అప్పగించింది మేము అన్నారు. అవాస్తవం. మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టాము. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది.
ఆరో అబద్దం :
50:50 రేషియో కోసం మేము కొట్లడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుంచి ఎన్నోసార్లు కోరాం. ఫిర్యాదులు చేశాం. న్యాయమైన వాటా కోసం ట్రైబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం అంటూ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక హరీష్ రావు మాట్లాడుతుండగా.. అధికార పక్షం అడ్డుతగులుతూ వచ్చింది. శ్వేతపత్రంలో పేర్కొన్న ఖర్చులు, ఆయకట్టు అంశాలు రెండుచోట్ల రెండు రకాలుగా చెప్పారని ఆరోపించారు. రూ.54,239 కోట్లు ఖర్చు పెట్టి 57.79 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని ఒకచోట చెప్పారని, మరోచోట రూ.54,234 కోట్లు ఖర్చు చేసి 41.76 లక్షల ఎకరాలకు నీరందించినట్లు చెప్పినట్లు హరీశ్రావు వివరించారు.
రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు మా ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదనేది పచ్చి అబద్ధం. ప్రభుత్వం చట్టసభల్లో ఇలాంటి అసత్యాలతో పత్రాలు సభలో పెట్టడం సరికాదు. రాయలసీమ ఎత్తిపోతలపై 2020 మే 5న జీవో వచ్చింది. జీవో రాకముందే పత్రికల్లో వార్త ఆధారంగా 2020 జనవరి 29న కేంద్రానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే మే 12న కేంద్రం, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం. మేం ఫిర్యాదు చేసిన లేఖలు కావాలంటే ప్రభుత్వానికి పంపుతాం అన్నారు.
Read Also : SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు భారీ షాక్.. ఎందుకంటే..?
Related News
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ�