HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Good News For Hyderabad Metro Passengers From The Revanth Government

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ప్రభుత్వం చెపింది జరిగినట్లయితే, త్వరలోనే ప్రయాణికులు కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండటంతో, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • By Kode Mohan Sai Published Date - 02:32 PM, Fri - 20 December 24
  • daily-hunt
Hyderabad Metro
Hyderabad Metro

దేశంలోని అత్యంత రద్దీగా ఉన్న మెట్రోల్లో హైదరాబాద్ ఒకటి. ప్రతి రోజూ సుమారు 5 లక్షలకు పైగా ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోను ఉపయోగించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రారంభంలో మెట్రో ప్రయాణాలపై నగరవాసులలో పెద్దగా ఆసక్తి లేకపోయినా, క్రమంగా అది పెరిగి, ఇప్పుడు వారు మెట్రో సేవలను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం, ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ అనే మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు మార్గాలలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

నగరంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్లేందుకు మెట్రోను వాడే వారి సంఖ్య పెరిగిపోతున్నందున, ఉద్యోగులు, విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండటంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ట్రైన్లలో కూర్చుని ప్రయాణాలు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కొన్ని సందర్భాలలో కాలు పెట్టుకునే స్థలం కూడా ఉండటం లేదు. ఈ పరిస్థితితో ప్రయాణికులు మెట్రో కోచ్‌ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ వేదికగా మెట్రో ప్రయాణాలపై ఒక కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్‌లను పెంచాలని, ప్రస్తుతం ఆ నిర్ణయంపై యోచన చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ట్రైన్లు 3 కోచ్‌లతో నడుస్తున్నాయి. అయితే, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రోని ప్రారంభంలో 3 కోచ్‌లతో నడిపించేందుకు డిజైన్ చేయబడ్డది, అయితే ఆ కోచ్‌లను 6కి పెంచే మార్పు చేయవచ్చని అన్నారు. కానీ 8 కోచ్‌లుగా మార్చడానికి ప్రస్తుత డిజైన్ అనుమతించదని పేర్కొన్నారు. త్వరలోనే 6 కోచ్‌లుగా మెట్రోని అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ మార్పుతో మెట్రోలో ప్రయాణించే రద్దీ తగ్గి, ప్రయాణికులకు కూర్చొని ప్రయాణించే అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఇక, మెట్రో సెకండ్ ఫేజ్ పనులకి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉందని తెలిసిందే. ఈ దశలో కొత్తగా మరో ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. వాటికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ పథకంతో, త్వరలోనే నగరంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా మెట్రో ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad metro
  • Hyderabad Metro Train Extends
  • Minister Sridhar Babu
  • revanth reddy
  • Telangana Assembly

Related News

Raghunandan Rao

Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • CM Revanth Reddy

    Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Cm Revanth Reddy

    Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd