HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Hyderabad Metro Passengers From The Revanth Government

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ప్రభుత్వం చెపింది జరిగినట్లయితే, త్వరలోనే ప్రయాణికులు కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండటంతో, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Author : Kode Mohan Sai Date : 20-12-2024 - 2:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Metro
Hyderabad Metro

దేశంలోని అత్యంత రద్దీగా ఉన్న మెట్రోల్లో హైదరాబాద్ ఒకటి. ప్రతి రోజూ సుమారు 5 లక్షలకు పైగా ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోను ఉపయోగించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రారంభంలో మెట్రో ప్రయాణాలపై నగరవాసులలో పెద్దగా ఆసక్తి లేకపోయినా, క్రమంగా అది పెరిగి, ఇప్పుడు వారు మెట్రో సేవలను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం, ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ అనే మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు మార్గాలలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

నగరంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్లేందుకు మెట్రోను వాడే వారి సంఖ్య పెరిగిపోతున్నందున, ఉద్యోగులు, విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండటంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ట్రైన్లలో కూర్చుని ప్రయాణాలు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కొన్ని సందర్భాలలో కాలు పెట్టుకునే స్థలం కూడా ఉండటం లేదు. ఈ పరిస్థితితో ప్రయాణికులు మెట్రో కోచ్‌ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ వేదికగా మెట్రో ప్రయాణాలపై ఒక కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్‌లను పెంచాలని, ప్రస్తుతం ఆ నిర్ణయంపై యోచన చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ట్రైన్లు 3 కోచ్‌లతో నడుస్తున్నాయి. అయితే, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రోని ప్రారంభంలో 3 కోచ్‌లతో నడిపించేందుకు డిజైన్ చేయబడ్డది, అయితే ఆ కోచ్‌లను 6కి పెంచే మార్పు చేయవచ్చని అన్నారు. కానీ 8 కోచ్‌లుగా మార్చడానికి ప్రస్తుత డిజైన్ అనుమతించదని పేర్కొన్నారు. త్వరలోనే 6 కోచ్‌లుగా మెట్రోని అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ మార్పుతో మెట్రోలో ప్రయాణించే రద్దీ తగ్గి, ప్రయాణికులకు కూర్చొని ప్రయాణించే అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఇక, మెట్రో సెకండ్ ఫేజ్ పనులకి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉందని తెలిసిందే. ఈ దశలో కొత్తగా మరో ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. వాటికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ పథకంతో, త్వరలోనే నగరంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా మెట్రో ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad metro
  • Hyderabad Metro Train Extends
  • Minister Sridhar Babu
  • revanth reddy
  • Telangana Assembly

Related News

Telangana Speaker G Prasad Kumar

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

  • Congress

    Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం హావ !!

  • Vote Chori Rally

    Vote Chori : ‘ఓట్ చోరీ’పై ఈరోజు కాంగ్రెస్ మెగా ర్యాలీ

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd