HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Hyderabad Metro Passengers From The Revanth Government

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ప్రభుత్వం చెపింది జరిగినట్లయితే, త్వరలోనే ప్రయాణికులు కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండటంతో, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-12-2024 - 2:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Metro
Hyderabad Metro

దేశంలోని అత్యంత రద్దీగా ఉన్న మెట్రోల్లో హైదరాబాద్ ఒకటి. ప్రతి రోజూ సుమారు 5 లక్షలకు పైగా ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోను ఉపయోగించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రారంభంలో మెట్రో ప్రయాణాలపై నగరవాసులలో పెద్దగా ఆసక్తి లేకపోయినా, క్రమంగా అది పెరిగి, ఇప్పుడు వారు మెట్రో సేవలను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం, ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ అనే మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు మార్గాలలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

నగరంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్లేందుకు మెట్రోను వాడే వారి సంఖ్య పెరిగిపోతున్నందున, ఉద్యోగులు, విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండటంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ట్రైన్లలో కూర్చుని ప్రయాణాలు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కొన్ని సందర్భాలలో కాలు పెట్టుకునే స్థలం కూడా ఉండటం లేదు. ఈ పరిస్థితితో ప్రయాణికులు మెట్రో కోచ్‌ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ వేదికగా మెట్రో ప్రయాణాలపై ఒక కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్‌లను పెంచాలని, ప్రస్తుతం ఆ నిర్ణయంపై యోచన చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ట్రైన్లు 3 కోచ్‌లతో నడుస్తున్నాయి. అయితే, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రోని ప్రారంభంలో 3 కోచ్‌లతో నడిపించేందుకు డిజైన్ చేయబడ్డది, అయితే ఆ కోచ్‌లను 6కి పెంచే మార్పు చేయవచ్చని అన్నారు. కానీ 8 కోచ్‌లుగా మార్చడానికి ప్రస్తుత డిజైన్ అనుమతించదని పేర్కొన్నారు. త్వరలోనే 6 కోచ్‌లుగా మెట్రోని అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ మార్పుతో మెట్రోలో ప్రయాణించే రద్దీ తగ్గి, ప్రయాణికులకు కూర్చొని ప్రయాణించే అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఇక, మెట్రో సెకండ్ ఫేజ్ పనులకి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉందని తెలిసిందే. ఈ దశలో కొత్తగా మరో ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. వాటికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ పథకంతో, త్వరలోనే నగరంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా మెట్రో ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad metro
  • Hyderabad Metro Train Extends
  • Minister Sridhar Babu
  • revanth reddy
  • Telangana Assembly

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd