Tenth Exams : పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…పరీక్షలపై కేసీఆర్ కీలక నిర్ణయం..!!
తెలంగాణలో పదవ తరగతి చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్.
- By hashtagu Published Date - 08:35 PM, Thu - 13 October 22
తెలంగాణలో పదవ తరగతి చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ ఏడాదిలో కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాక ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. కోవిడ్ ముందు రాష్ట్రంలో పదవ తరగతి కి సంబంధించి మొత్తం 11 పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా వాటిని 6 పేపర్లకు తగ్గించింది.
తరగతులు సరిగ్గా జరకపోవడం, సిలబస్ పూర్తికాకపోవడంతో…ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కోవిడ్ తీవ్రరూపం దాల్చడంతో నిర్వహించలేదు. 2022లో 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా 2023లో నిర్వహించనున్న పరీక్షలకు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఊరట లభించినట్లయ్యింది.
Tags
Related News
Telangana : రేపు తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమం
ఇప్పటికే రైతుబంధు ఇవ్వక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇలా మాట మార్చి మరోసారి రైతులను మోసం చేసిందని..ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా రేపు బిఆర్ఎస్ శ్రేణులు , రైతులు నిరసన చేపట్టాలని’ కేసీఆర్ పిలుపునిచ్చారు.