Hyderabad : హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్లు స్వాధీనం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం, విదేశీ కరెన్సీ, సిగిరేట్లను
- By Prasad Published Date - 08:37 AM, Thu - 27 July 23
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం, విదేశీ కరెన్సీ, సిగిరేట్లను స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి రూ.42.8 లక్షల విలువైన 704 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘా ఆధారంగా అధికారులు కువైట్ నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారు బియ్యం, సర్ఫ్ మరియు షాంపూ మొదలైన వాటిలో బంగారాన్ని దాచారు. మరో ఘటనలో సీఐఎస్ఎఫ్తో కలిసి కస్టమ్స్ అధికారులు రస్ అల్ ఖైమాకు వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడిని పట్టుకుని అతడి వద్ద నుంచి రూ.7.56 లక్షల విలువైన వివిధ దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.2.25 లక్షల విలువైన 15,000 విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్లు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003కి అనుగుణంగా లేవని అధికారులు తెలిపారు. నిందితులందరిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు రోజు దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 1.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�