HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Mla Of Bodhan In Grain Scam

former MLA Shakeel : ధాన్యం స్కామ్ లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్..

  • By Sudheer Published Date - 07:27 PM, Sat - 16 December 23
  • daily-hunt
Sheekel
Sheekel

అధికారం చేతిలో ఉంటె ఎన్ని ఆటలైన ఆడొచ్చు..ఒన్స్ అధికారం పోయిందా..ఇక అసలైన అట అధికార పార్టీ మొదలుపెడుతుంది. ప్రస్తుతం తెలంగాణ లో అదే జరుగుతుంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు..ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందినకాడికి దోచేశారు..ఇక ఇప్పుడు దోచేసిన దాన్ని బయటకు తీసే పని పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బిఆర్ఎస్ మాజీ మంత్రులను , ఎమ్మెల్యే లను టార్గెట్ గా పెట్టుకొని వరుస షాకులు ఇస్తుంది.

ఇప్పటికే ఆర్మూర్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) వరుస షాకుల మీద షాకులు తగులుతుంటే..తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel) కు భారీ షాక్ తగిలింది. షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం (CMR Rice) మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

షకీల్ కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇక.. మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పారు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్, ఆర్కామ్ ఇండస్ట్రీస్, అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్, ఎఫ్ఎఎఫ్ ఇండస్ట్రీస్ అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపించారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూ ర్వకంగా రాసిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2 వేల మెట్రిక్ టన్నులు, ఆర్కిమ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాకకు ఇచ్చారు. ఎఫ్ఎఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులు అడగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటె ఇక మాజీ మంత్రి, మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు అయింది. శామీర్ పేట ఎమ్మార్వోతోపాటు, మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో మల్లారెడ్డి ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా బిఆర్ఎస్ నేతలందరికీ వరుస షాకులు తగులుతున్నాయి. మరి ఇంకెంతమందికి షాక్ ఇస్తారో చూడాలి.

Read Also : Drugs : డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bodhan ex mla shakeel
  • rice scam

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd