T BJP : ఈటెలకు బీజేపీ పగ్గాలు, కేంద్ర మంత్రిగా `బండి`?
తెలంగాణలో రాజ్యధికారం దిశగా బీజేపీ(T BJP) వేగంగా అడుగులు వేస్తోంది. సంస్థాగత ప్రక్షాళన కూడా భారీ చేయాలని ప్లాన్ చేస్తోంది.
- By CS Rao Published Date - 12:18 PM, Mon - 26 December 22
తెలంగాణలో రాజ్యధికారం దిశగా బీజేపీ(T BJP) వేగంగా అడుగులు వేస్తోంది. సంస్థాగత ప్రక్షాళన కూడా భారీ చేయాలని ప్లాన్ చేస్తోంది. రాబోవు రోజుల్లో బీసీలకు(BCs)అధికారం దిశగా తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పడానికి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే (T BJP) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ వెనుకబడిన వర్గాలకు చెందిన లీడర్. ఆయన్ను మరింత బలోపేతం చేయడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ క్రమంలో కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నారని టాక్.
బీజేపీ (T BJP) రాష్ట్ర అధ్యక్షుడుగా..
కొన్ని దశాబ్దాలుగా `రెడ్డి` సామాజికవర్గం రాజ్యాధికారాన్ని తెలంగాణ రాష్ట్రంలో అనుభవిస్తూ వస్తోంది. ఆ తరువాత వెలమ సామాజికవర్గం విడిపోయిన రాష్ట్రాన్ని రాజకీయంగా కబ్జా చేసింది. తొలుత దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు. `ఉద్యమ సమయంలో ఎన్నో చెబుతాం. ఆనాటి వ్యూహాలు వేరంటూ ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ మారిందని` అప్పట్లో సెలవిచ్చారు. అయినప్పటికీ రెండోసారి సీఎంగా కేసీఆర్ ను తెలంగాణ ఓటర్లు ఎన్నుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వాదాన్ని కూడా పక్కపడేసి జాతీయ వాదాన్ని అందుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బడుగులకు(BCs) రాజ్యాధికారాన్ని కట్టబెట్టే వ్యూహం బీజేపీ చేస్తోందని టాక్.
బండి సంజయ్ మీద అసంతృప్తులు
ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ కొంత మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలను రాబట్టారు. ఇదంతా బీజేపీ సమష్టి కృషికి నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే, సంస్థాగతంగా బండి సంజయ్ మీద సంతృప్తులు ఉన్నాయి. ఆయనకు అధిష్టానం వద్ద మంచి పేరు ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీలో ఒక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తోంది. కరీంనగర్ కేంద్రంగా ఆయన మీద వ్యతిరేక టీమ్ ఉంది. ఢిల్లీ వరకు వెళ్లి బండి మీద ఫిర్యాదు కూడా చేశారు. తాత్కాలికంగా వివాదాన్ని సర్థినప్పటికీ నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి రగులుతోందని పార్టీ అంతర్గత వర్గాల్లోని చర్చ.
Also Read : Bandi Sanjay on KTR: కేటీఆర్ కు బండి సంజయ్ ‘ఓపెన్ ఛాలెంజ్’
అనతికాలంలోనే అత్యున్నత పదవికి ఎదిగిన బండి సంజయ్ కు రాబోవు రోజుల్లో కేంద్ర మంత్రి పదవిలో స్థానం కల్పించడానికి ఢిల్లీ బీజేపీ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఈటెల రాజేంద్రను ఫోకస్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎత్తుగడలు బాగా తెలిసిన లీడర్ ఈటెల. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతం ఇవ్వనుంది. ఎన్నికల నాటికి ఈటెల రాజేంద్రకు పూర్తి బాధ్యతలు అప్పగించడం ద్వారా బీసీలను ఏకం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికపై నుంచి రాష్ట్ర వేదికపైకి వచ్చే అవకాశం ఉంది. రాబోవు ఎన్నికల్లో `రెడ్డి-బీసీ` కాబినేషన్లో ఎన్నికలకు వెళ్లాలని మాస్టర్ స్కెచ్ వేసినట్టు వినికిడి. ఆ క్రమంలో `బండి`కి బదులుగా ఈటెలకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం త్వరలోనే ఉందని తెలుస్తోంది.
Related News
MLA Raja Singh : బిజెపి సభలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు అవమానం..
బీజేపీ కీలక నేతలు సభా వేదికపైకి హాజరవాల్సి ఉండగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ ను మాత్రం వెళ్లనివ్వలేదు. రాజాసింగ్ వేదికపైకి వెళ్తుండగా.. ప్రధాని మోడీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అనుమతి నిరాకరించింది.