ED : సాహితీ ఇన్ఫ్రాటెక్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
సాహితీ ఇన్ఫ్రాటెక్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మేనేజింగ్ డైరెక్టర్ B లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ S
- By Prasad Published Date - 08:11 AM, Fri - 22 December 23
సాహితీ ఇన్ఫ్రాటెక్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మేనేజింగ్ డైరెక్టర్ B లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ S పూర్ణచంద్రరావు, వారి కుటుంబ సభ్యులు, సంబంధిత సంస్థలు, Omics International Ltd సంస్థలకు సంబంధిచి రూ.161.50 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సాహితీ ఇన్ఫ్రాటెక్, దాని ప్రమోటర్లు/డైరెక్టర్లు మరియు ఇతరులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన వివిధ ఎఫ్ఐఆర్ల ఆధారంగా వివిధ పెట్టుబడిదారులు/కొనుగోలుదారుల ఫిర్యాదులపై ED దర్యాప్తు ప్రారంభించింది, ఇందులో SIVIPL, ఇతర గ్రూప్ సంస్థలు చేపట్టిన వివిధ ప్రాజెక్టుల మొత్తం 655 మంది కొనుగోలుదారులు డెలివరీకి హామీ ఇచ్చారు. ఫ్లాట్లు/విల్లాల పేరుతో మొత్తం రూ. రూ. 248.27 కోట్లు సాహితీ ఇన్ఫ్రాటెక్ వసూలు చేసింది. అమీన్పూర్ గ్రామంలో ‘సర్వాణి ఎలైట్’ ప్రాజెక్ట్తో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం కస్టమర్ల నుండి 250 కోట్లు వసూలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అమీన్పూర్ విలేజ్లో సుమారు రూ.89 కోట్లతో మొత్తంగా భూమిని కొనుగోలు చేసింది. అయితే, ప్రాజెక్టు ప్రారంభించి 3 సంవత్సరాలు గడిచినా SIVIPL భూమిలో ఎటువంటి నిర్మాణాన్ని ప్రారంభించలేదని ఈడీ అధికారులు పేర్కొన్నారు. విచారణలో ఆ సంస్థ రూ.32.15 కోట్లు అమీన్పూర్ విలేజ్లో ఓమిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న 9 ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి కేటాయిందిచింది.ఈడీ దర్యాప్తులో ఎస్ఐవీఐపీఎల్ మాజీ డైరెక్టర్, అప్పటి సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ హెడ్ సందు పూర్ణచంద్రరావు SIVIPL కస్టమర్ల నుండి రూ. 126 కోట్లు వసూలు చేసినట్లు తెలింది. ఇందులో రూ.50 కోట్లు 2018 మరియు ఆగస్టు 2020 మధ్య కస్టమర్ల నుండి నగదు రూపంలో సేకరించారు. తదుపరి విచారణలో S. పూర్ణచంద్రరావు తన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యులు, సంస్థల పేరు మీద కోట్లాది రూపాయల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నారని వెల్లడైంది. దీంతో సాహితీ ఇన్ఫ్రాటెక్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Also Read: Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాలలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.