HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Controversy Over Ifs Officers Foreign Tour Telangana Cmo Into Action

CMO Vs PCCF: సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్‌.. ఐఎఫ్ఎస్ అధికారుల టూర్‌పై వివాదం

అయితే ఈ పర్యటనకు వెళ్లి వచ్చిన ఐఎఫ్ఎస్(CMO Vs PCCF) అధికారులకు ఫిబ్రవరి 22న తెలంగాణ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్‌) డోబ్రియాల్‌ మెమోలు జారీ చేశారు.

  • Author : Pasha Date : 02-03-2025 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cmo Vs Pccf Telangana Ifs Officers Foreign Tour Telangana Cm Revanth Pccf Rm Dobriyal

CMO Vs PCCF: తెలంగాణ ఐఎఫ్ఎస్ అధికారుల బృందం కెన్యా, టాంజానియా పర్యటనపై వివాదం రాచుకుంది. ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఆయా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం కోసం వీరంతా పర్యటనకు వెళ్లారు. అది కూడా  సీఎస్‌ శాంతికుమారి అనుమతితోనే. దీనిపై ఫిబ్రవరి 18న సీఎస్‌ శాంతికుమారి జీవోఆర్టీ నంబరు 224ను జారీ చేశారు. ఈ పర్యటనకు అయ్యే ఖర్చును తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని సూచించారు.  దీంతో ఫిబ్రవరి 20 నుంచి 27 వరకు ఆరుగురు ఐఎఫ్ఎస్ అధికారుల బృందం కెన్యా, టాంజానియా దేశాల్లో పర్యటించింది.  అంతా క్లియర్‌గానే ఉంది.

అధికారులు పర్యటనలో ఉండగానే మెమోలు

అయితే ఈ పర్యటనకు వెళ్లి వచ్చిన ఐఎఫ్ఎస్(CMO Vs PCCF) అధికారులకు ఫిబ్రవరి 22న తెలంగాణ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్‌) డోబ్రియాల్‌ మెమోలు జారీ చేశారు. తనకు చెప్పకుండా విదేశీ పర్యటనకు  ఎలా వెళ్లారంటూ వారి నుంచి సంజాయిషీ కోరారు. కెన్యా, టాంజానియా పర్యటనకు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి మినహా మిగిలిన ఐఎఫ్ఎస్ అధికారులంతా తన కిందే పనిచేస్తున్నారని  మెమోల్లో డోబ్రియాల్‌ గుర్తు చేశారు. ‘‘ఈ పర్యటనకు వెళ్లిన అధికారులంతా తమ విదేశీ పర్యటన వివరాలను డాక్యుమెంటరీ ఆధారాలతో విడివిడిగా నాకు సమర్పించాలి. మార్చి 10లోగా వీటిని సమర్పించాలి. లేదంటే విదేశీ పర్యటన వివరాలను దాచిపెట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. ప్రవర్తనా నియమావళిని  ఉల్లంఘించినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది’’ అని డోబ్రియాల్‌ జారీ చేసిన మెమోల్లో ఉంది. అధికారులు పర్యటనలో ఉండగానే వారికి మెమోలను జారీ చేయడం గమనార్హం. తెలంగాణ సీఎస్ శాంతికుమారి అనుమతితోనే ఐఎఫ్ఎస్ అధికారులు టూర్‌కు వెళ్లినా, డోబ్రియాల్ మెమోలు ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Also Read :Meenakshi Natarajan : మీనాక్షి మార్క్.. టీపీసీసీ కార్యవర్గం ఎంపికలో మారిన లెక్క

సీఎంఓ కార్యదర్శి జి.చంద్రశేఖర్‌రెడ్డి కూడా..

విదేశీ పర్యటనకు వెళ్లిన అధికారుల్లో.. శాంతారామ్‌ ప్రాజెక్టు టైగర్‌ ఫీల్డ్‌ డైరక్టర్‌ సునీతా ఎం.భగవత్‌ (అడిషనల్‌ పీసీసీఎఫ్‌ అడ్మిన్‌), జూపార్కు డైరక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ ఎస్‌.హిర్మనాథ్‌, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌ఓలు పేట్ల రాజశేఖర్‌, గోపిడి రోహిత్‌, ఎకో టూరిజం ఈడీ ఎల్‌.రంజిత్‌ నాయక్‌ ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారులతో కలిసి ఈ పర్యటనకు వెళ్లిన వారిలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి జి.చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈయన సీఎంవోలో అటవీశాఖను పర్యవేక్షిస్తుంటారు. అయినా ఐఎఫ్ఎస్ అధికారులకు డోబ్రియాల్‌ నోటీసులు పంపడం గమనార్హం.

Also Read :Bus Crash: బస్సులు ఢీ.. 37 మంది మృతి, 39 మందికి గాయాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • CMO Vs PCCF
  • foreign tour
  • IFS Officers
  • R M Dobriyal
  • telangana
  • telangana CMO
  • Telangana PCCF

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

Latest News

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd