Prashant Kishor: కేసీఆర్ పై ‘పీకే’ యూటర్న్!
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఝలక్ ఇచ్చారా? ఆయనకు కటీఫ్ చెప్పి కాంగ్రెస్ తో జట్టు కట్టబోతున్నారా?
- By Balu J Published Date - 12:37 PM, Sat - 26 March 22
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఝలక్ ఇచ్చారా? ఆయనకు కటీఫ్ చెప్పి కాంగ్రెస్ తో జట్టు కట్టబోతున్నారా? తెలంగాణతోపాటు దేశ రాజకీయాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వరుస పరాజయాలు పట్టి పీడిస్తున్నాయి. అందులోనూ ఈ ఏడాది నవంబర్ లో గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను పీకేకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందుకే రాజకీయ నాయకులు ఎప్పుడూ ఒకే మాటపై ఉండడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఇది రాజకీయ వ్యూహకర్తలకూ వర్తిస్తున్నట్టే ఉంది. అందుకే పీకే కూడా తన స్ట్రాటజీని మార్చినట్టే ఉంది. పీకేతో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్టు రాహుల్ గాంధీయే గుజరాత్ నాయకులతో చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం గుజరాత్ విషయంలోనే కాకుండా.. వచ్చే ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను పీకేకి అప్పగించే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో జట్టు కడితే మరి తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? కేసీఆర్ తో కలిసి పనిచేయరా? ఈ ప్రశ్నలకూ కాంగ్రెస్ నేతలకు పీకే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో ఇంకా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని.. అక్కడి రాజకీయ వాతావరణం తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేశామని అన్నట్టుగా సమాచారం. అంటే కేసీఆర్ తో పని చేసే విషయంలో పీకే రూటు మార్చుకున్నారా?
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కల్పించగలనని గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ అన్నారు. అలా చేసే పక్షంలో ఆయన ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించినట్టు ప్రచారం జరిగింది. ఇక సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ లేని లోటు ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనలా రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దడంతోపాటు పార్టీలో అన్ని వర్గాలను కోఆర్డినేట్ చేసే వ్యక్తి ఇప్పుడు పార్టీకి అవసరం ఉంది. అందుకే ఆ బాధ్యతను పీకేకు ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ లో ఓ వర్గం భావిస్తోంది. కానీ అప్పట్లో రాహుల్ గాంధీ దీనిపై నిర్ణయానికి రాలేకపోయారు. ఇప్పుడు దీనిపై పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కాని పీకేతో ఒప్పందం చేసుకుంటే.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మార్పులు వస్తాయి. ఇప్పటివరకు ప్రతిపక్ష పాత్రలో చురుగ్గా ఉన్న బీజేపీకి దీటుగా కాంగ్రెస్ ఎదిగే అవకాశముంది. టీఆర్ఎస్ కూడా ఇరకాటంలో పడుతుంది. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పీక్ స్టేజ్ కు చేరే ఛాన్సుంది.
Related News
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకు�