HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Speech At Jntu Quality Of Engineering Education Meeting

CM Revanth : ‘వైఫ్ లేకుండా ఉండొచ్చేమో గానీ వైఫై లేకుంటే ఉండలేని పరిస్థితి’ వచ్చింది – సీఎం రేవంత్

పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ సరిగ్గా జరగలేదని.. ఇప్పుడు పకడ్బందీగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు

  • By Sudheer Published Date - 09:53 PM, Sat - 13 July 24
  • daily-hunt
Cm Revanth Jntu
Cm Revanth Jntu

ప్రస్తుతం ‘వైఫ్ లేకుండా ఉండొచ్చేమో గానీ వైఫై లేకుంటే ఉండలేని పరిస్థితులు’ వచ్చాయన్నారు సీఎం రేవంత్ (CM Revanth Reddy). శనివారం హైదరాబాద్ జేఎన్టీయూలో (JNTU) ఏర్పాటు చేసిన ‘నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య’ ( JNTU Quality Of Engineering Education Meeting) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజినీరింగ్ అత్యంత అవసరం. కొన్ని కళాశాలల్లో ఆ కోర్సు లేకుండా చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నడపాలి. ఈ కోర్సులు లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది.

విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారడం తమ ప్రభుత్వానికి ఏమాత్రం సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో కాలేజీలు ప్రపంచ అవసరాలకు తగినట్టుగా సరికొత్త ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. అందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో తొలిసారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఇక బకాయిలను కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేలా.. మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం సహా అటానమస్ హోదా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ గ్రూప్ – 1, పరీక్షల వాయిదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

టీజీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతోందని.. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. ‘గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఇప్పుడు 1:100 పిలవాలని కొందరు కోరుతున్నారు. అయితే, ఇలా పిలవడానికి మాకు ఏ ఇబ్బందీ లేదు. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే నోటిఫికేషన్‌లో చెప్పిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుంది.’ అని స్పష్టం చేశారు.

డీఎస్సీ, గ్రూప్ – 2, 3 పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్లపై కూడా సీఎం స్పందించారు. పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ సరిగ్గా జరగలేదని.. ఇప్పుడు పకడ్బందీగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా కోసం పరితపిస్తున్నాయని ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని స్పష్టం చేసారు.

ప్రస్తుతం ‘వైఫ్ లేకుండా ఉండొచ్చేమో గానీ వైఫై లేకుంటే ఉండలేని పరిస్థితులు’ వచ్చాయి. ఈరోజుల్లో తల్లిదండ్రులకు తీరికలేదు. పిల్లల్ని స్కూల్ కు పంపి వాళ్లు ఉద్యోగాలకు వెళ్తున్నారు. కానీ ఇంటికి వచ్చాక టైమ్ తీసుకొని పిల్లలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి. వారు ఫోన్లకు బానిసలు కాకుండా చూడాలి’ అని కోరారు.

Read Also : Pawan Kalyan : అనంత్ అంబానీ రిసెప్షన్‌ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం సందడి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • CM Revanth Reddy Speech
  • JNTU
  • Quality of Engineering Education

Related News

Group-1 Candidates

Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.

  • Dussehra Holidays

    Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

  • Bathukamma Kunta

    Bathukamma Kunta: ఎల్లుండి బతుక‌మ్మ కుంటను ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి!

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

  • CM Revanth Medaram Visit

    CM Revanth Medaram Visit: ఈనెల 23న మేడారంలో ప‌ర్య‌టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Latest News

  • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

  • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

  • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

  • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd