CM Revanth Reddy : న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
- By Pasha Published Date - 07:35 AM, Mon - 1 January 24
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరాన్ని ‘రైతు – మహిళ – యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణగా.. కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా.. అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఏడాది విషెస్ చెప్పారు. తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల్లో మాట ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేశామని సీఎం చెప్పారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తామన్నారు. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయతను జోడించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ‘పదేళ్లుగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు ఎదురు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళం అవసరం లేదు. ఇది గత పాలన కాదు.. జన పాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయని’ రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించి, పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామన్నారు రేవంత్(CM Revanth Reddy).
Also Read: January 1 Horoscope : జనవరి 1 రాశిఫలాలు.. ఆ రాశివారికి ధన లాభం
అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆ కేసుల నుంచి వారికి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ‘ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపైనా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంం. దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Related News
TPCC Chief : కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? రేసులో దిగ్గజ నేతలు
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎన్నుకునేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది.