HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Emergency Meeting With Ministers And Officials

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అల‌ర్ట్‌!

భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.

  • Author : Gopi Date : 27-05-2025 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) మంత్రులు, అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం రుతుపవనాలు 15 రోజుల ముందుగా వచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, 90 శాతం సేకరణ పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. ఈ విజయానికి అధికారులు, కలెక్టర్లను అభినందించారు.

ధాన్యం కొనుగోలు కోసం రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లించినట్లు, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే రుతుపవనాల ముందస్తు రాకతో మిగిలిన ధాన్యం సేకరణలో సవాళ్లు ఎదురవుతున్నాయని, దీన్ని అధిగమించేందుకు స్థానిక గోడౌన్లను అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Also Read: KCR: కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందుకు కేసీఆర్‌.. ఆ లేఖ త‌ర్వాతే ఎందుకు?

రాజకీయ ప్రేరేపిత దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కలెక్టర్లు ప్రోయాక్టివ్‌గా ఉండాలని, ధాన్యం కొనుగోలు వివరాలను ప్రజలకు వెల్లడించాలని సీఎం సూచించారు. ఉదాహరణకు, ఒక రైతు అనారోగ్యంతో మరణించిన సంఘటనను ధాన్యం కొనుగోలుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను 29 శాతం అధిక వర్షపాతం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్ట్ విధించాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, కొత్త టెక్నాలజీని వినియోగించాలని, ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో అందించాలని సూచించారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్లకు రుణాలు అందించాలని ఆదేశించారు. మే 29, 30 తేదీల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రులు పర్యటించాలని, జూన్ 1 నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Emergency Meeting
  • ministers
  • Officials
  • rains
  • telugu news

Related News

Cm Revanth

Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్ర

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Weather Update

    Telangana : తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు మ‌రింత ఆల‌స్యం

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd